యంగ్ హీరోయిన్స్ రాకతో బాగా వెనుక పడిన త్రిష కెరియర్ అయిపోయింది అనుకున్న నేపధ్యంలో కన్నడ టాప్ హీరో పునీత్ రాజ్ కుమార్ తో నటించిన సినిమా (తెలుగు ‘దూకుడు’ రీమేక్) కన్నడంలో సూపర్ హిట్ కావడంతో తిరిగి త్రిషకు దశ తిరిగి కోలీవుడ్ లో వరస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. దీనికి తోడు టాలీవుడ్ లో బాలకృష్ణ తో లేటెస్ట్ సినిమాలో నటిస్తూ ఉండటంతో ఈ సినిమా పై కూడా త్రిష గంపెడు ఆసలు పెట్టుకుంది.  అయితే ఊహించని పిడుగులా త్రిష చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియన్ పెళ్లాడబోతోంది అని కోలీవుడ్ మీడియాలో వార్తలు ఒక్కసారి రావడంతో ఆ వార్తలను త్రిష ఖండించినా త్రిషతో సినిమాలు తీద్దాము అని ఆలోచిస్తున్న చాలామంది నిర్మాతలు ఈ పెళ్ళి వార్తతో రివర్స్ గేర్ లో త్రిష నుంచి జారుకోవడమే కాకుండా త్రిషతో సినిమాలు తీయడానికి అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలు చాలామంది ఆ ఎడ్వాన్స్ లను తరిగి ఇచ్చేయమని త్రిష పై వత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  దీనికి తోడు తమిళంలో ‘ఉదయం ఎన్ హెచ్ 9’ సినిమాను నిర్మించిన దర్శక నిర్మాతలు తాము నిర్మించబోతున్న లేటెస్ట్ సినిమాలో హీరోయిన్ గా త్రిషను తొలగించి ఈ సినిమాలో జీవా తో హీరోయిన్ గా సురభిని ఎంపిక చేయడానికి త్రిష పెళ్ళి గాసిప్ వార్తలే అని స్పష్టంగా ఆమెకే చెప్పారని టాక్.  ఈ వార్తలు ఇలా ఉండగా త్రిష పెళ్ళి వార్తలలో పెళ్ళి కొడుకుగా ఉన్న పారిశ్రామిక వేత్త వరుణ్ మణియన్ త్రిషతో తన పెళ్ళి వార్తలను ఖండించకుండా ‘భార్యను చూసుకోవడం ఎలా’ అనే విషయంపై పుస్తకాలు చదువుతున్నానని తన ట్విట్ లో పెట్టడం త్రిషతో సినిమాలను తీస్తున్న నిర్మాతలను మరింత గందరగోళంలో పడేసింది అనే వార్తలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: