ప్రతి సామజిక విషయం పైన స్పందించే సమంత ఈరోజు ‘నా బంగారు తల్లి’ సినిమాను ప్రత్యేకంగా చూడటమే కాకుండా ఆ సినిమా చుసిన ఉద్వేగంతో తన కంట కన్నీరు పెట్టుకుని ఆ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాలను తెలియచేసింది సమంత. వ్యభిచార కూపంలో మగ్గుతున్న మహిళల దీనావస్థను కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా తన హృదయాన్ని కదిలించి వేసిందని అంటూ ఇటువంటి చిత్రాన్ని ఆదరించవలసిన బాధ్యత అందరి పైనా ఉంది అంటూ ఈ సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది సమంత.  మూడు జాతీయ అవార్డులతో పాటు ఐదు అంతర్జాతీయ అవార్డులు పొందిన తెలుగు చిత్రం ‘నా బంగారు తల్లి’ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వంద థియేటర్లలో విడుదలయి మంచి సినిమాలను చూసే ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. రాజేష్ టచ్ రివర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అమ్మాయిలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపే యదార్ధ సమస్య చుట్టూ ఈ సినిమా ఉంటుంది.  ఇప్పటికే అక్కినేని అమల, చిరంజీవి ప్రశంసలతో పాటు సమంత కూడా ఈ సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. అంతేకాదు తాను సినిమా రంగం నుండి రిటైర్ అయ్యేలోపు ఇటువంటి ఒక వాస్తవిక సినిమాలో నటిస్తాను అని మీడియా ఎదురుగా వాగ్దానాలు చేసింది సమంత.  ఇన్ని మాటలు చెపుతున్న సమంతను ఒక మీడియా ప్రతినిధి ఇటీవల వ్యభిచార కేసులో ఇరుక్కున్న శ్వేతబసు గురించి ప్రస్తావించగానే ఇది ‘నా బంగారు తల్లి’ సినిమా ప్రమోషన్‌ అంటూ తెలివిగా మాట దాట వేసింది సమంత..   

మరింత సమాచారం తెలుసుకోండి: