'పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి జోష్ మీద ఉన్న సాయి ధరమ్ తేజ్ తనకు సెంటిమెంట్ గా నమ్మకం ఉన్న అరసవిల్లి సూర్యనారాయణుడి దర్శనం చేసుకుని నిన్న శనివారం శ్రీకాకుళం నుండి ఈ సినిమా విజయ యాత్రకు శ్రీకారం చుట్టాడు సాయి ధరమ్ తేజ్. శ్రీకాకుళంలో ఈ సినిమా ప్రదర్శింపబడుతున్న ధియేటర్ లో సాయి ధరమ్ తేజ్ కు మెగా అభిమానులు బ్రమ్మరధం పట్టారు.  ఆ తరువాత మీడియాతో మాట్లాడిన సాయి ధరమ్ తేజ్ తన గురించి కొన్ని ఆ శక్తికర విషయాలను తెలియచేయడమే కాకుండా మీడియా ద్వారా తన పెద్ద మామయ్యా చిరంజీవిని ఒక తీర్చలేని కోరిక కోరాడు. తాను డిగ్రీ పూర్తి చేసాక మొదటిగా లాయర్ అవుదామని అనుకున్న ఆ వృత్తికి తాను సరిపడను అన్న ఉద్దేశ్యంతో లాయర్ కోటుకు బదులు సినిమాల పై తన దృష్టి మళ్ళింది అని అన్నాడు.  అయితే తన కోరిక విన్న వెంటనే తన కుటుంబ సభ్యులలో చాలామంది వ్యతిరేకించినా తనను ప్రోత్సహించింది మాత్రం తన ఆఖరి మామయ్యా పవన్ కళ్యాణ్ అంటూ పవన్ పొగడ్తలతో ముంచేత్తేసాడు సాయి ధరమ్ తేజ్. ఇన్ని విషయాలు మీడియాతో మాట్లాడుతూ తన మనస్సులోని అసలు కోరికను బయట పెట్టాడు చిరూ మేనల్లుడు. తనకు తన పెద్ద మామయ్యా అవకాశం ఇస్తే చిరంజీవి 150వ సినిమాలో నటించాలని ఉన్నదని మీడియా ద్వారా తన కోరికను బయట పెట్టాడు. కోరిక బాగానే ఉంది కాని చిరంజీవి 150వ సినిమాలో నటించాలని ఉంది అంటూ ఇప్పటికే రామ్ చరణ్, అల్లుఅర్జున్ లతో పాటు ఇంకా చాలామంది టాలీవుడ్ సెలెబ్రెటీలు అడుగుతున్న నేపధ్యంలో తన ముద్దుల మేనల్లుడి కోరికను చిరూ మన్నించ గలడా అన్నదే ప్రశ్న.  ఇప్పటి వరకు కథ ఏమిటో, దర్శకుడు ఎవ్వరో తెలియని చిరంజీవి 150వ సినిమా ఎప్పుడూ ప్రారంభం అవుతుందో తెలియక పోయినా నటించే నటీనటుల లిస్టు మాత్రం కొండలా పెరిగి పోతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: