అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి చిత్రంగా వచ్చిన ‘మనం’ విజయం వెనుక ఆ సినిమాకు దర్శకుడు విక్రమ్ కుమార్ అందించిన అద్భుతమైన స్క్రీన్ ప్లే ఆ సినిమా ఘనవిజయం వెనుక దాగు ఉన్న సీక్రెట్. ఆ సినిమా విజయం తరువాత దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన ఒక వెరైటీ కథకు ఇష్టపడి కోలీవుడ్ టాప్ హీరో సూర్య తానే నిర్మాతగా వ్యవహరిస్తూ తమిళ, తెలుగు భాషల్లో ఒక సినిమాను తానే హీరోగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన ఈ సినిమాకు ‘24’ అనే టైటిల్ పెట్టారు. ఈమధ్యనే ఈ సినిమా టైటిల్ లోగోని విడుదల చేయడంతో ఈ టైటిల్ లోగోతోనే ఈ సినిమాకు భారీ పబ్లిసిటీ వస్తోంది. రహమాన్ సంగీతం అందించే ఈ చిత్రానికి కేథరిన్ థెరీస హీరోయిన్ గా నటించనుందని సమాచారం.  'సింగం', 'సింగం 2' వంటి వరుస హిట్లను అందించిన సూర్య అనుకోకుండా 'అంజాన్‌' సినిమాతో పరాజయం చెందడంతో షాక్ కు గురైన సూర్య తన మాస్ పద్దతిని మార్చి ఒక వెరైటీ సినిమాలో నటించాలి అన్న ఉద్దేశ్యంతో విక్రమ్ కుమార్ చెప్పిన ఈ వెరైటీ సినిమాలో నటిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ట్విస్ట్ ఏమిటంటే మొదట్లో ఈ సినిమా కథను విక్రమ్ కుమార్ మహేష్ కు వినిపిస్తే మహేష్ కథ విని నిర్ణయం చెప్పేలోపే హీరో సూర్య విక్రమ్ కుమార్ ను తన వైపుకు తిప్పుకున్నాడు అనే టాక్ ఉన్నది. ‘మనం’ ఛాయలుతో ఉండే ఈ ‘24’ సినిమా ఎన్ని సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: