టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ టెంపర్. ఈ మూవీకి సంబధించిన ఆడియో విడుదల ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తరువాత ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం రభస. ఈ మూవీకి సంబంధించిన ఆడియో ఎక్కడ జరుగుతుంది? అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తికర కథనాలు జరుగుతున్నాయి. అంతే కాకుండా తాజాగా ఈ మూవీ ఆడియో వేడుకకు నందమూరి అభిమానులు అంటే బాలయ్యకి సంబంధించిన అభిమాన బలం హాజరు కాకపోవచ్చనే టాక్స్ కూడ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్, పూరీ జగన్నాధ్‌ల ఈ లేటెస్ట్ ఫిల్మ్ ‘టెంపర్’ ఆడియోను నిమ్మకూరు‌లో నిర్వహిస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అంతే కాకుండా ఈ టెంపర్ ఆడియో ఫంక్షన్ ని నిమ్మకూరులో హై‌రేంజ్‌లో జరపాలని ప్లాన్ చేస్తున్నారట. గతంలో ఎన్టీఆర్, పూరీ కాంబినేషన్లో వచ్చిన ‘ఆంధ్రావాలా’ ఆడియో ఇక్కడే జరిగి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తీరా ఆ మూవీ ఫ్లాప్‌గా నిల్చింది. మళ్ళీ పదేళ్ళ తర్వాత ఈ కాంబో సెట్ అయింది.అయితే ఎక్కడ పోగుట్టుకున్నామో, అక్కడే సంపాదించుకోవాలి అన్న కసితో, ఈ టెంపర్ ఆడియో ఫంక్షన్ ని నిమ్మకూరులోనే మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఈసారి కూడా ఆడియో వేడుక అక్కడే జరిపి ఎలాగైనా హిట్ కొట్టాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. అంతే కాకుండా ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు బాలకృష్ణ, నందమూరి హీరోలు, కుటుంబసభ్యులను అందర్నీ పిలిచేందుకు జూనియర్ ప్లానిం లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే చివరకు ఈ ఆడియో వేడుక అనేది, రాజకీయ వేడుకగా మారుతుందోమో? అంటూ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా టెంపర్ ఆడియో వేడుక నిమ్మకూరులో ఏ రేంజ్ లో జరుగుతుంతో తెలియాంటే మరి కొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: