సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన గ్లామర్ తో ఓ ఊపు ఊపిన హాట్ బ్యూటీ, త్రిష. అయితే గత కొంత కాలంగా త్రిష మళ్ళీ మూవీలలో నటించి తన సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్ లోనూ హీరోయిన్ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తుంది. తనకి సెకండ్ హీరోయిన్ ఆఫర్స్ వస్తున్నప్పటికీ, వాటిని ఏ మాత్రం ఎంకరేజ్ చేయడం లేదు. అందుకే చాలా మంది నిర్మాతలు, దర్శకులు త్రిషని మెయిన్ హీరోయిన్ గా తీసుకోవాటానికి ఆసిక్తి చూపడంలేదు. దీంతో తనకి అవకాశాలు తగ్గిపోతున్నాయి. కాని సీనియ యాక్టర్స్ మాత్రం హీరోయిన్ కి సంబంధించిన విషయంలో ఇబ్బందులు పడుతుంటే, వారిని త్రిష వరంగా మారింది. తప్పని పరిస్థితుల్లో త్రిషని హీరోయిన్ గా తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల క్రితం త్రిష వివాహ నిశ్చితార్థం జరుపుకుందన్న వార్త, సౌత్ మీడియాలో బాగా హల్ చేసింది. ఎంగేజ్ మెంటు వార్తలో వాస్తవం లేదని ఆమె వెంటనే ప్రకటించినప్పటికీ, కోలీవుడ్ మాత్రం ఆమె మాటల్ని నమ్మడం లేదు. దీంతో త్రిషకి మీడియాపై విపరీతమైన కోసం వస్తుందట. ఇదిలా ఉంటే, హఠాత్తుగా పెళ్లి చేసేసుకుంటే తమ సినిమాకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనన్న ఉద్దేశంతో ఇప్పటికే ఆమెను బుక్ చేసుకున్న కొందరు నిర్మాతలు మెల్లగా డ్రాప్ అవుతున్నారట. ఈ నేపథ్యంలో జయ్ హీరోగా మణిమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నుంచి కూడా త్రిషమ్మను తొలగించినట్టు సమాచారం. ఆమె స్థానంలో సురభిని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో తన వద్దకు వచ్చిన అతి కొద్ది ఛాన్స్ లు కూడ మిస్ అయిపోతుంటే, రీసెంట్ గా త్రిష మరో కామెంట్ చేసింది. ఎంగేజ్ మెంట్ కాదు, ఏకంగా పెళ్ళి చేసుకుంటాను. అంత కంటే ముందు సహజీవనం చేసుకుంటాను అంటూ మీడియాపై హాట్ కామెంట్స్ విసిరిందట. దీంతో త్రిష ప్రవర్తనపై కోలీవుడ్ లో రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: