ఈవారం 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలీవుడ్ ఫిల్మ్ ‘జిద్’ పై మంచి అంచనాలు ఉన్నాయి. వివేక్ అగ్నిహోత్రీ డైరెక్షన్‌లో రానున్న ఈసినిమా ట్రైలర్‌ ఇప్పటికే యూత్‌ని బాగా ఆకర్షిస్తోంది. ఈసినిమాలో ప్రియాంక కజిన్ మన్నారాతోపాటు తెలుగు హీరోయిన్ శ్రద్ధాదాస్ నటిస్తోంది.  ఈ మూవీ షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాల్లో మన్నారా చేసిన ఓవర్ యాక్షన్ తో శ్రద్ధాదాస్ నరకాన్ని చూశానని చెపుతోంది. ఈ విషయాన్ని స్వయంగా శ్రద్ధాదాస్ మీడియాకు లీక్ చేసింది. ఇక వివరాలలోకి వెళితే ఈ సినిమాలో తాను మన్నారా గొడవపడే సన్నివేశాల చిత్రీకరణలో తనకు ఊహించని అనుభవం ఎదురైంది అన్నది ఈ బ్యూటీ. సామాన్యంగా సినిమాలకు సంబంధించి చెంప చెళ్లుమనిపించే సన్నివేశాల్లో నటిస్తున్న నటీనటులు ఆశన్నివేశాలకు అనుగుణంగా నటిస్తారు తప్ప ఎవరూ ఎవర్ని కొట్టరు అని అంటూ కానీ, మన్నారా మాత్రం తనను నిజంగానే తనను కొట్టిందని మీడియాకు లీక్ చేసింది శ్రద్ధాదాస్. మొదటిసారి మన్నారా పొరపాటున కొట్టిందని సరిపెట్టుకున్నా రెండవసారి తనను నకిలీ కర్రతో కొట్టవలసిన సీన్ లో తనను నిజమైన కర్రతో కొట్టడంతో తనకు గాయాలయ్యాయని గగ్గోలు పెడుతోంది శ్రద్ధా. అయితే తనను ఆమె ఎందుకు అలా టార్చర్ పెట్టిందో ఇప్పటికీ తనకు అర్థంకావడంలేదని చెపుతూ తనకు బాలీవుడ్ సినిమాలంటే భయం వేస్తోంది అని అంటోంది శ్రద్ధాదాస్..  

మరింత సమాచారం తెలుసుకోండి: