మోహన్ బాబు ఎటువంటి గొప్ప వ్యక్తులను అయిన తన మాటలతో సెటైర్లు వేస్తూ టార్గెట్ చేస్తాడు అన్న విషయం తెలిసిందే. నిన్న జరిగిన ఒక ప్రస్ మీట్ లో మోహన్ బాబు అరవింద్ పై వేసిన సెటైర్లు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారాయి. తెలుగు సినిమా పరిశ్రమ అంతా ఏకమై హుధూద్ తుపాన్ బాధితుల సహాయార్థం ఏర్పాటు చేస్తున్న 'మేము సైతం' కార్యక్రమ వివరాలను తెలపడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మోహన్ బాబు తన మాటల వేడిని అరవింద్ పై ప్రయోగించాడు అనే వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ ప్రెస్ మీట్ కు వచ్చిన మోహన్ బాబును ఆ ప్రెస్ మీట్ నిర్వహింపబడుతున్న హాల్ లో పలకరించడానికి ప్రయత్నం చేసాడట అరవింద్. అయితే అరవింద్ మాటలు విన్న మోహన్ బాబు ఆయన వంక చూస్తూ తన గంభీరమైన స్వరంతో 'హూ ఆర్ యు' అని సెటైర్ వేయడమే కాకుండా తన ముందు ఎవ్వరు ఉన్నారో చూడమని చెపుతూ కాస్తంత దూరంలో నిలబడ్డ దాసరిని చూపెడుతూ 'నాకు ఆయన గురువు మరి గురువు ముఖ్యమా? నువ్వు ముఖ్యమా' అని అంటూ అందరి మధ్యనే అరవింద్‌ని పై సెటైర్ వేసాడట మోహన్ బాబు.  అయితే అనుకోని ఈ సెటైర్లకు కాస్త ఇబ్బంది పడ్డ అరవింద్ వెంటనే తేరుకుని దూరంగా నిలబడ్డ దాసరి వద్దకు వెళ్ళి అరవింద్ పలకరించాడని టాక్. అయితే అక్కడ కూడా మోహన్ బాబు అరవింద్ ను తన మాటల సెటైర్లతో ఇబ్బంది పెట్టాడని ఆ ప్రెస్ మీట్ కు వెళ్ళిన చాలామంది అనుకోవడం వినిపిస్తోంది.  ఇలా ఎక్కడ పడితే అక్కడ మాటలతో యుద్దాలు చేసుకుని మోహన్ బాబు అరవింద్ ల పిల్లలు అల్లుఅర్జున్, అల్లు శిరీష్, మంచు విష్ణు, మంచు మనోజ్ లు తామంతా ప్రాణ స్నేహితులం అని తరుచు చెపుతూ ఉంటారు. దీనిని బట్టి చూస్తే రాజకీయాలలో సినిమాలలో శాశ్విత మిత్రులు శాశ్విత శత్రువులు ఉండరు అనే విషయాన్ని రుజువు చేసేలా అల్లు వారి మంచు వారి సెటైర్ల ప్రహసనం ఉంది అని వీరి మాటల యుద్ధం చూసిన వారు కామెంట్లు చేయడం వినిపించింది అని టాక్..   

మరింత సమాచారం తెలుసుకోండి: