సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగార్జున కి మంచి స్టార్ డం ఉంది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా నాగార్జున ఓ మూవీకి సంబంధించిన విషయంలో స్టార్ హీరోయిన్ కూతురితో మంతానాలు నడుపుతున్నట్టుగా క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. మేటర్ లోకి వెళితే, నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ డెబ్యూగా పరిచయం కాబోతున్న ఫిల్మ్ లో, ఇండియన్ ఫిమేల్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న యాక్టర్ శ్రీదేవి కూతురు హీరోయిన్ గా నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నాగార్జున, శ్రీదేవితోనూ అలాగే బోణికపూర్ తో చర్ఛలు జరిగిపినట్టు బిటౌన్ మీడియాలోనూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అక్కినేని అఖిల్ సినీ రంగప్రవేశం కోసం తెలుగు ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. 'మనం' చిత్రంలో జస్ట్ 30 సెకన్లు కనిపించి, మంచి మార్కులు కొట్టేశాడు అఖిల్. ఇక తను హీరోగా ఎంటర్ అవుతన్న మూవీ కోసం అయితే, ఇప్పటినుండే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. అందుకే ఈ మూవీపై భారీ క్రేజ్ క్రియేట్ చేసేందుకు నాగార్జున తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అఖిల్ సరసన బోనీకపూర్, శ్రీదేవిల ముద్దుల కూతురు జాన్విని కథానాయికగా అయితే బాగుంటుందంటూ శ్రీదేవికి చాలా విధాలుగా నాగార్జున వివరించాడంట. అయితే శ్రీదేవి, బోణికపూర్ లు మాత్రం ఇందుకు ఇష్టం చూపుతునే, మరోవైపు జాన్విని ను బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి పరిచయం చేయాలని ఆలోచిస్తున్నారంట. మొత్తానికి జాన్విని, అఖిల్ సరసన నటిస్తుందా? లేదా? అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే. 'జోష్' ద్వారా రాధ తనయ కార్తీకను టాలీవుడ్ కి తీసుకువచ్చారు నాగ్. ఇప్పుడు తన రెండో కొడుకు అఖిల్ చిత్రం ద్వారా శ్రీదేవి కూతురిని టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం చేసిన ఘనత నాగ్ కే దక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: