టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ది ప్రత్యేకమైన స్టార్ డం. బాక్సాపీస్ ని షేక్ చేయగల సత్తా యంగ్ టైగర్ కి ఉంది. ముఖ్యంగా జూనియర్ కి ఉన్న అభిమాన బలం కూడ చాలా బలమైనది. అయితే గత కొంత కాలంగా జూనియర్ నటిస్తున్న ఫిల్మ్స్ ఏవీ బాక్సాపీస్ వద్ద అంతగా సక్సెస్ ని సాధించలేకపోతున్నాయి. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. జూనియర్ సెలక్ట్ చేసుకుంటున్న దర్శకులు ప్రతిభావంతులైనప్పటికీ, కథ విషయంలోనూ, కథనం నడిపే విషయంలోనూ చాలా వీక్ గా ఉండంటంతో, ఆ మూవీ బాక్సాపీస్ వద్ద జస్ట్ పాస్ మార్కులతో ముందుకు వెళుతుంది. ప్రస్తుతం యంగ్ టైగర్ తోటి బ్యాచ్ అయిన హీరోలు అందరూ సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇప్పుడు యంగ్ హీరోస్‌లో అందరూ ఏదొక మూవీతో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాము అనే విధంగా పేరు తెచ్కుకున్నారు. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, మహేష్‌, ప్రభాస్‌ ఇలా అందరూ ఏదొక క్రేజీ ప్రాజెక్ట్ తో ముందుకు వెళుతున్నారు. వీరందరి తాజా చిత్రాల బాక్సాపీస్ రిజల్ట్స్ చూసుకుంటే జూనియర్ మూవీల కంటే కొద్దిగా బెటర్. అందుకే జూనియర్ ఈసారి ఎలాగైనా సక్సెస్ ని కొట్టేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ చేస్తోన్న టెంపర్‌ పట్ల అతని అభిమానుల్లోనూ ఉత్కంఠ కనిపిస్తోంది. మొదట ఈ మూవీని అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగానే ముగించేయాలని దర్శకుడు పూరీ అనకున్నప్పటికీ, సీన్స్ విషయంలో ఏ మాత్రం తొందరలేకుండా, సమయం తీసుకున్నా సరిగ్గా నిర్మించాలని జూనియర్ చెప్పాడంట. అంతే కాకుండా ఏదైనా సీన్స్ వీక్ గా ఉంటే వాటిని రీషూట్ చేయాల్సిందిగా, దర్శకుడిపై జూనియర్ ఒత్తిడి తీసుకువస్తున్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా జూనియర్ ఈ సారి టెంపర్ మూవీతో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని చూసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: