ఈనెల 30వ తారీఖున జరగబోతున్న ‘మేము సైతం’ కార్యక్రమానికి సంబంధించి ఒకొక్క విషయం నెమ్మదిగా బయటకు వస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పవన్, మహేష్, జూనియర్, రామ్ చరణ్, అల్లుఅర్జున్ లు రకరకాల కామెడీ స్కిట్స్ లో పాల్గొనబోతున్నారు అనే వార్తలకు తోడు ఈ కార్యక్రమంలో రాజమౌళి సమర్పించబోతున్న ఒక కామెడీ స్కిట్ సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం రాజమౌళి ‘బాహుబలి’ టీమ్ పేరుతో సమర్పిస్తున్న కామెడీ స్కిట్ లో ప్రభాస్, రానా, అనుష్కలు రాజుల కాలం నాటి గెటప్ లు వేసుకుని కామెడీ స్కిట్ చేస్తారట. పూర్తిగా నవ్వు తెప్పించే ఈ స్కిట్ లోని ప్రతి సంభాషణ రాజమౌళి తీస్తున్న ‘బాహుబలి’ షూటింగ్ జరుగుతున్నప్పుడు జరిగిన నవ్వు తెప్పించే సంఘటనల నేపధ్యంలో ఈ కామెడీ స్కిట్ ఉంటుందని వార్తలు అందుతున్నాయి.  ఒక విధంగా కామెడీ స్కిట్ చేస్తూ తాము తీస్తున్న ‘బాహుబలి’ సినిమా కోసం తామంతా ఎంత కష్టపడుతున్నామో ప్రజలకు తెలిసేట్టు చేసి తన ‘బాహుబలి’ సినిమాకు మరింత క్రేజ్ వచ్చే విధంగా తెలివిగా రాజమౌళి ‘మేము సైతం’ కార్యక్రమాన్ని కూడా మలుచుకుంటున్నాడు అనే వార్తలు వినపడుతున్నాయి. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు. ఈ రెండు కళ్ళల్లో ఏకంటికీ ప్రమాదం జరిగినా తెలుగు సినిమా పరిశ్రమ అంతా ‘మేము సైతం’ అంటు ప్రతిస్పందిస్తుందని అంటూ నిన్న దాసరి చేసిన వ్యాఖ్యలను బట్టి టాలీవుడ్ అటు ఆంధ్రప్రదేశ్ ను ఇటు తెలంగాణా రాష్ట్రాన్ని సమానంగా చూస్తూ భవిష్యత్ వైపు అడుగులు వేయబోతోంది అనే స్పష్టమైన సంకేతాన్ని ఈ ‘మేము సైతం’ కార్యక్రమం ఇచ్చేలా కనిపిస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: