సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తే ఆ మూవీపై దాదాపు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖల అందరి దృష్టి పడుతుంది. ముఖ్యంగా ఫిల్మ్ సెలబ్రిటీలు ఆ మూవీ గురించి ఆలోచించకపోయినా, మేనేజర్స్ మాత్రం ఆ విషయాలను సెలబ్రిటీలకు ఎప్పటికప్పుడూ వివరిస్తూనే ఉంటారు. ఆ విధంగా తాజాగా ఓ తమిళ చిత్రం వంద కోట్లు సాధించి, అందరికి ఆకర్షించింది. అదే 'విజయ్','మురుగదాస్' కాంబినేషన్ లో వచ్చిన 'కత్తి' మూవీ తమిళంలో ఈ మూవీ వంద కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. దీనితో ఈ చిత్రాన్ని తెలుగులో రీమెక్ చేస్తున్నట్లు టాక్ వచ్చింది. అయితే టాలీవుడ్ లో ఎవ్వరూ ఈ మూవీని అంగీకరించిన హీరోలు? అన్నదానిపై ఇప్పటి వరకూ క్లారటీ రాలేదు. మొదటగా ఈ చిత్రంపై 'పవర్ స్టార్' మనస్సు పారేసుకున్నాడని వార్తలు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ ఈ చిత్రంపై అంతగా ఆసక్తి చూపించడం లేదని తేలిపోయింది. దీనితో డబ్బింగ్ చేయాలని ఆ నిర్మాత డిసైడ్ అయ్యాడు. కానీ తాజాగా ఈ సినిమాను తెలుగులో రీమెక్ చేయాలని 'ఠాగూర్ మధు' డిసైడ్ అయ్యారంట. ఇందుకోసం 'అల్లు అర్జున్', 'జూనియర్ ఎన్టీఆర్'లను సంప్రదించినట్లు సమాచారం. ఇందులో ఏ ఒక్క హీరో నటించినా టాలీవుడ్ లో గొప్ప చిత్రంగా నిలుస్తుందని ఠాగూర్ మధు భావిస్తున్నాడంట. అయితే అల్లుఅర్జున్ ఇంకా కత్తి మూవీ ప్రివ్యూని చూడలేదు. జూనియర్ మాత్రం కత్తి మూవీని చూశాడు. కాని ఇప్పటి వరకూ ఏ విషయాన్ని నిర్మాతతో చెప్పలేదు. దీంతో నిర్మాత ఠాగూర్ మధు, జూనియర్ చెప్పే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాడు. 'కత్తి' చిత్రంలో రాజకీయాల ప్రస్తావన ఉంది కాబట్టి జూ.ఎన్టీఆర్ అయితే బాగుంటుందని మధు ఆలోచిస్తున్నట్గుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: