సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి కొద్ది ఆఫర్స్ తోనే స్టార్ డం ని సందపాదించిన బ్యూటీ ప్రణీత. తను నటించిన అత్తారింటికి దారేది మూవీలో చేసింది సెకండ్ హీరోయిన్ రోల్ అయినప్పటికీ, సమంత కంటే తన పాత్రకే ఎక్కువుగా పేరు వచ్చింది. ఇక అక్కడ నుండి ప్రణీతకి మార్కెట్ లో రేటు డబుల్ అయింది. తన రెమ్యునరేషన్ ని ఒక్కసారిగా డబుల్ చేసుకున్నా, కొంత మంది నిర్మాతలు మాత్రం ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా తీసేసుకున్నారు. ఇదిలా ఉంటే కొంత కాలానికి ప్రణీతకి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. క్లియర్ గా చెప్పాలంటే ప్రణీతకు ప్రస్తుతం చేతిలో ఆఫర్లు కరువయ్యాయి. ఆమె ఆఖరి చిత్రం ‘రభస’ ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయనేది అందరూ చెబుతున్న రీజన్. సహజంగా ఆఫర్స్ తగ్గినప్పుడు హీరోయిన్స్ వారి రెమ్యునరేషన్ ని తగ్గించుకుంటారు. కాని ప్రణీత విషయంలో అలా జరగటంలేదు. తనకి ఆఫర్స్ లేకపోయినా, రెమ్యునరేషన్ ని మాత్రం తగ్గించేది లేదంటూ ఖారాఖండిగా చెబుతుంది. కొంత మంది నిర్మాతలు అయితే, ప్రణీత చెప్పే రేటుకి భయపడి ఆఫర్స్ ఇవ్వటానికి కూడ వెనకడుగు వేస్తున్నారు. ఇదిలా ఉంటే తనకి తాజాగా ఓ బంపర్ ఆఫర్ దొరికింది. అనుకోని కారణాల వలన సూర్య ‘మాస్’ చిత్రం నుండి అమీ జాక్సన్ ని తప్పించి ఆ స్థానం ప్రణీతకు ఇచ్చారు. మాస్ సినిమాను గతంలో కార్తీతో బిర్యాని తీసిన వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సూర్య ఈ సినిమాలో నయనతార, ప్రణీతలతో జతకట్టనున్నాడు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నాడు. ఇప్పుడు సూర్య సరసన ప్రణీతకి ఆఫర్ రావడంతో ఈ బ్యూటీ ఎగిరి గంతేసింది. అయితే ఇలా వచ్చిన ఆఫర్ లోనూ ప్రణీత, దాదాపుగా నయనతారతో పాటు సరిసమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: