టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తాజాగా ఎంట్రి ఇచ్చిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్. కేవలం కొద్ది నెలల గ్యాప్ లోనే మరో మెగా హీరో, మెగా ఫ్యామిలీ నుండి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రి ఇవ్వబోతున్నాడు. తనే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ ముకుంద. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ రిపోర్ట్ బాగున్నప్పటికీ, రిలీజ్ కి సంబంధించిన విషయంలో నిర్మాతలు భయపడుతున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటించిన తొలి చిత్రం 'ముకుంద' రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. దీనిని డిసెంబర్ 24న దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంలో కొద్దిగా మార్పులు తీసుకురావాలని, తిరిగి ఈ మూవీని 2015 సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. వరుణ్ తేజ్ మూవీ 2014 సంవత్సరం చివరిలో వస్తే అందరూ పెద్ద పట్టించుకోరు, కాని సంక్రాంతికి వస్తే ముకుంద మూవీపై హై ఎక్స్ పెక్టేషన్స్ వస్తాయి అని నిర్మాతలు భావిస్తున్నారంట. అయితే, సరిగ్గా అదే సమయంలో పవన్ కల్యాణ్ నటించిన 'గోపాల గోపాల' సినిమా కూడా విడుదల కానుండడంతో, ఆ సినిమా ఎఫెక్ట్ దీనిపై పడుతుందన్న భావనతో నిర్మాతలు భయపడుతున్నారు. ఏదేమైనా ముకుంద మూవీని సంక్రాంతికి వారం రోజుల ముందుగానో, లేక జనవరి 1, 2015న సైతం రిలీజ్ చేయటానికి చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది. ఈ రెండు డేట్స్ లో ఏదో ఒకటి ఫైనలైజ్ చేయాలని నిర్మాతలు కసరత్తులు చేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ మూవీ కాకుండా ఉంటే, కచ్ఛితంగా సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది నిర్మాతల ఆలోచన. సంక్రాంతికి పవన్ కళ్యాణ్ నటించిన మల్టీస్టారర్ మూవీ బరిలో ఉండటంతో, ముకుంద మూవీ రిలీజ్ డేట్ తర్జన భర్జనలు పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: