అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన పాత్రలో నటిస్తున్న శింబు దేవన్ దర్శకత్వంలో కోలీవుడ్ టాప్ హీరో విజయ్ హీరోగా నిర్మిస్తున్న ఒక సోషల్ మైధలాజికల్ సినిమాకు శ్రీదేవి తీసుకుంటున్న భారీ పారితోషికం ఆ సినిమాలో నటిస్తున్న ఇతర నటీనటులను కూడా ప్రభావితం చేసి ఆ సినిమా నిర్మాతలకు చుక్కలు చూపెడుతోంది అని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.  ఈ సినిమాలో హాన్సికకు తల్లిగా రాజమతగా నటిస్తున్న శ్రీదేవి ఈ సినిమా నిర్మాతల నుండి 5 కోట్లు లాగేసిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ వార్తలు తన దృష్టికి రావడంతో ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న కన్నడ హీరో సుదీప్ తనకు కోటిన్నర ఇస్తే కాని ఈ సినిమాలో నటించనని  సినిమా నిర్మాతలకు స్పష్టంగా చెప్పినట్లు టాక్.  మొదటిగా ఈ సినిమాకు సంబంధించి కోటి రూపాయల పారితోషికానికి ఒప్పుకున్నా సుదీప్ తన పారితోషికం విషయంలో శ్రీదేవి పారితోషిక విషయాన్ని చూసి, ఇలా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా వ్యవహరించడం ఈ సినిమా నిర్మాతలకు సమస్యగా మారిందని టాక్. ఒకవేళ సుదీప్ కోరికలకు ఒప్పుకున్నా ఈ వార్తలను తెలుసుకుని ఇదే సినిమాలో నటిస్తున్న హన్సిక, శ్రుతిహాసన్ లు కూడా తమ పారితోషికాల విషయంలో ఇలాగే  ప్లేట్ తిప్పితే ఈ సినిమా బడ్జెట్ ఏ రేంజ్ కి చేరిపోతుందో అంటూ ఈ సినిమా నిర్మాతలు టెన్షన్ పడుతున్నారని టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: