ఈరోజు అందర్నీ విడిచి సుదూర తీరాలకు వెళ్ళిపోయిన చక్రి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ టాలీవుడ్ పరిశ్రమ అంతా చక్రి భౌతిక దేహాన్ని కడసారి సందర్సిస్తోంది. ఫిలిం చాంబర్ ఆఫీసులో పెట్టిన ఆయన భౌతిక దేహాన్ని ఎందరో టాలీవుడ్ ప్రముఖులు కడసారి సందర్శిస్తున్నారు. చిరంజీవి, రామానాయుడు,బాలకృష్ణ లాంటి ప్రముఖులు ఎందరో చక్రి మృతి షాక్ నుండి తేరుకోలేక పోతున్నారు.  ఇక గాయని శ్రీలేఖ చక్రి గురించి మాట్లాడుతూ చక్రి 'జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది' అనే పాటను ఆయన ఎందుకు కంపోజ్ చేశారో తెలియదు కానీ ఆ పాట చక్రి జీవితానికి సరిగ్గా సరిపోతుందని ఆమె అనడం అందర్నీ కలిచివేసింది. ఇది ఇలా ఉండగా చక్రి చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఆదివారం అర్ధరాత్రి దాకా ఆయన రికార్డింగ్ థియేటర్ లోనే గడిపారు అని తెలుస్తోంది. అర్ధరాత్రి దాటాక పని ముగించుకుని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తన ఇంటికి తిరిగొచ్చి నిద్రపోయారట. నిద్రలోనే గుండెపోటుకు గురి అయి చక్రి మరణించినట్లు తెలుస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా చక్రి ఆఫీసులో పనిచేసే ఆఫీసు బాయ్ తో చక్రి అర్దరాత్రి తన ఇంటికి వెళ్లేముందు పూరి జగన్నాథ్ ప్రస్తావన తీసుకు వస్తూ జగన్ అన్నయ్యతో (పూరి జగన్నాథ్)మాట్లాడాలి అంటూ వెళ్లిపోయారని అదే చక్రి ఆఖరి మాటలు అంటూ కన్నీటి పర్యంతం అయిన చక్రి ఆఫీసు బాయ్ చెప్పిన విషయాలు పూరి, చక్రీల విడదీయరాని అనుబంధాన్ని మరొక సారి గుర్తుకు చేసాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: