ఎదో ఒక సంచలన వార్తలలో మీడియాలో కనిపించకుండా రానాకు రోజుగడవదు అనుకోవాలి. త్రిషతో తన స్నేహం ముగిసి పోయిన తరువాత రానా తన మాజీ గర్ల్ ఫ్రెండ్ బిపాసాబసుతో తన స్నేహాన్ని మళ్ళీ ప్రారంభించడమే కాకుండా రానా ప్రస్తుతం బిపాసాతో డేటింగ్ చేస్తున్నాడు అంటూ ఈరోజు ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ఒక కధనాన్ని ప్రచురించింది. దీనికి కారణం రానా తన పుట్టినరోజును బిపాసాతో కలిపి ఒక నైట్ క్లబ్ లో సెలెబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఆ నైట్ పార్టీకి రానా సన్నిహితులైన చాలామందిని ఆహ్వానించాడు అని ఆ ఆంగ్ల పత్రిక కథనం. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పార్టీకి మరొక అతిధిగా కోలీవుడ్ హీరోయిన్ లక్ష్మి రాయ్ కూడా వచ్చింది.  ఒకప్పుడు రానా బిపసాల మధ్య స్నేహం బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్. ఆ తరువాత విడిపోయిన ఈ స్నేహితులు ఇద్దరు తిరిగి విక్రమ్ పడ్నీస్ దర్శకత్వం వహిస్తున్న ఒక కొత్త బాలీవుడ్ సినిమాలో ప్రస్తుతం నటిస్తూ ఉండటంతో తిరిగి వీరిద్దరి మధ్య స్నేహం మొదలైందని బాలీవుడ్ మీడియా టాక్. 2011 లో విడుదలైన ‘దమ్ మోర దమ్’ సినిమా షూటింగ్ లో వీరు కలిసి నటిస్తున్నప్పుడు వీరిద్దరి మధ్యా స్నేహం పై అనేక గాసిప్పులు వచ్చాయి. ఆ సినిమా తరువాత బిపాసాకు దూరమైనా రానా తిరిగి ఇలా ఒక నైట్ క్లబ్ లో ప్రత్యక్షం కావడంతో రానా తన ప్రేమకు సంబంధించి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు అంటూ గాసిప్పులు మొదలయ్యాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: