సెలెబ్రెటీల జీవితాల పై రకరకాల సంచలన విషయాలను అక్షరాలుగా మార్చి పుస్తక రూపంలో ప్రచురించి ఆ పుస్తకాన్ని రాసిన రచయితలు పేరుతో పాటు కాసులు పండించుకుంటున్న సందర్భాలు దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఎన్నికల సమయంలో ‘పవన్ కళ్యాన్ హఠావో - పాలిటిక్స్ బచావో’ అనే పేరుతో పుస్తకం రాసిన బొగ్గుల శ్రీనివాస్ వ్యవహారం అప్పట్లో తీవ్ర సంచలనం క్రియేట్ చేసింది. ఈ పుస్తకం పై రకరకాల వివాదాలు చుట్టుముట్టడంతో ఈ రచయిత తో అనేక ఇంటర్వ్యూలను కూడా అనేక ఛానల్స్ అప్పట్లో నిర్వహించాయి. ఎన్నికలు పూర్తి అయి పోయాక ఈ పుస్తకం గురించి ఈ రచయిత గురించి చాలామంది మరిచిపోయారు. అయితే ఈ పుస్తకానికి సంబంధించిన వార్తలు మళ్ళీ వెబ్ మీడియాలో కనిపిస్తున్నాయి.  దీనికి కారణం హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం జరిగే బుక్ ఫెయిర్ లో ప్రదర్శనకు  ఒక స్టాల్ లో పెట్టారు అనే వార్తలు కూడా వెబ్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే ఈ పుస్తకం విషయంలో ఎటువంటి వివాదాలు జరగకుండా ఈ పుస్తకానికి గట్టి భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మళ్ళీ ఈ పుస్తకం వార్తలలోకి రావడంతో ఈ పుస్తకం పై విమర్శలు ప్రతి విమర్శలతో మళ్ళీ వార్తల హడావిడి మొదలవుతుంది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: