ఈసారి కొత్త సంవత్సరాన్ని మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ కోసం వెరైటీగా అబుదాబిలో సెలిబ్రేట్ చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ వెల్లడించాడు. ఈసారి కొత్త సంవత్సరం మొదటిరోజు అంతా తన కొడుకు గౌతమ్ తో కూతురు సితారతో కలిసి అత్యంత సాహసోపేతమైన మరియు విలాసవంతమైన అబుదాబిలోని ఒక హాలిడే స్పాట్ కు మహేష్ వెళ్ళబోతున్నాడట. అంతేకాదు మహేష్ తన కొడుకు గౌతమ్ తో కలిసి చిన్నపిల్లవాడిలా మారిపోయి అక్కడి ఎడారులలో ఒంటెల పై ఎక్కి కామెల్ రైడ్స్ ఫాట్ బైకింగ్ ఈవెంట్స్ లో కొత్త సంవత్సరాన్ని ఎంజాయ్ చేయడానికి అప్పుడే తన యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే తనను గౌతమ్ న్యూయియర్ రోజున పూర్తిగా తనతో ఉండమని అడిగాడని అందువల్లే ఈ హాలిడే ట్రిప్ కు తాను ప్లాన్ చేశాననీ చెపుతున్నాడు టాలీవుడ్ ప్రిన్స్. అయితే ప్రపంచంలో ఇంతకన్నా మంచి హాలీడే స్పాట్స్ ఎన్నో ఉన్నా తన కూతురు సితారను దృష్టిలో పెట్టుకుని ఈ అబుదాబి ట్రిప్ ను ప్లాన్ చేసానని మహేష్ అంటున్నాడు. సితార ఇప్పటికి కొద్దిగా పెద్దదే అయినా ఎక్కువ దూరం ఫ్లైట్ లో జర్నీ చేస్తే అలిసి పోతుందట. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని కొన్ని రోజులు సినిమా విషయాలు మర్చిపోయి అబుదాబిలో సాహసాలు చేస్తూ తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తాను అని అంటున్నాడు ప్రిన్స్ మహేష్..

మరింత సమాచారం తెలుసుకోండి: