ప్రముఖ మహిళా దర్శకురాలిగా, నటిగా గిన్నిస్ బుక్ కు ఎక్కిన విజయనిర్మలకు అనుకోని షాక్ తగిలింది అని వార్తలు వస్తున్నాయి. అత్యధిక సినిమాలకు ఒక మహిళా దర్శకురాలిగా దర్శకత్వం వహించిన ఈమె ఒక సన్మాన సభలో షాక్ కు గురై కన్నీళ్లు పెట్టుకుంది అని టాక్. ఇక వివరాలలోకి వెళితే ఒక ప్రముఖ మహిళా సంస్థ మొన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో ఆమెకు సత్కార ఏర్పాట్లు చేసారు అని తెలుస్తోంది.  విజయనిర్మల ఈ సత్కారాన్ని అందుకోవడానికి ఆ సభకు వచ్చినప్పుడు ఆ సన్మాన సత్కార సభలో కేవలం పదుల సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నారట. ఆ జనాన్ని చూసిన విజయనిర్మల షాక్ కు గురి అయ్యారు అని టాక్. ఆ సత్కార సభకు అతిధులుగా వస్తారు అనుకున్న కొంతమoది రాజకీయవేత్తలు కూడా రాకపోవడంతో మైండ్ బ్లాంక్ అయిన విజయనిర్మల ఆసభలో మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచినట్లు టాక్. తాను ఏడేళ్ల వయస్సులోనే నటిగా కెరీర్‌ని మొదలుపెట్టినప్పటినుంచి ఇప్పటివరకు నటిగా, దర్శకురాలిగా ఎన్నో అవార్డులు తీసుకున్న తాను ఇలాంటి అవార్డ్సు ఫంక్షన్ మాత్రం ఎప్పుడూ చూడలేదని విజయనిర్మల బాధతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తన మీద అభిమానంతో కనీసం ఈ పదుల సంఖ్యలో ప్రేక్షకులు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేసి ఉద్వేగంతో ఆ అవార్డుని తీసుకోకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారని టాక్.  దీనిని బట్టి చూస్తూ ఉంటే నేటి సమాజం ఒకనాటి నటీనటులను రాజకీయ వేత్తలను ఏ విధంగా మరిచిపోయిందో మరొకసారి రుజువు అవుతోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: