జూ ఎన్టీఆర్–పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం ‘టెంపర్’. ఈ చిత్రంలో జూ.ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించింది, ముచ్చటగా మూడవ సారి ‘జూ ఎన్టీఆర్–కాజల్’ కలిసి నటించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ‘టెంపర్’ చిత్రంలో జూ.ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు. అయితే ప్రస్తుతానికి ఈమూవీకి ఓ సమస్య వచ్చిపడింది. అనుకున్న రిలీజ్ డేట్ కి టెంపర్ మూవీ రిలీజ్ కాకపోయేసరికి, చిత్ర యూనిట్ లో కొద్దిగా కలవరం మొదలైంది. 'టెంపర్' చిత్రానికి ఇంకా 18 రోజుల షూటింగు బ్యాలెన్సుగా వుంది. ఎన్టీఆర్ సోదరుడు జానకీరాం అకాలమరణం కారణంగా ఈ చిత్రం షూటింగు నిలిచిపోయిన సంగతి విదితమే. మళ్లీ ఎప్పటి నుంచి జరుగుతుందన్నది కూడా ఇంకా ఇదమిత్థంగా తెలియదు. దీంతో సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్న ఈ చిత్రం ఫిబ్రవరికి వాయిదాపడింది. అయితే బండ్ల గణేష్ ఇప్పటికే, మూవీ రిలీజ్ కి సంబంధించిన పలు కమిట్మెంట్స్ ని ఇచ్చాడు. వాటన్నింటిని తిరిగి సరిదిద్దుకునే పనిలో ఉన్నాడు. పూరీ జగన్నాధ్ కూడ చివరి షెడ్యూల్ ని ఏ రోజు స్టార్ట్ చేద్ధాం అనే ఆలోచనలో ఉన్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే టెంపర్ మూవీ అనుకున్న డేట్ కి రిలీజ్ కాలేకపోవడంతో, మూవీ రిలీజ్ పై సరైన ముహర్తం కోసం డైలమాలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా సుమారు పదేళ్ల తర్వాత ఎన్టీఆర్, పూరీ కలసి చేస్తున్న సినిమా కావడంతో దీనిపట్ల మంచి అంచనాలు వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: