మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ సినిమాల కథల ఎంపికలోనేకాదు ఆ సినిమాల ఎడిటింగ్ విషయంలో కూడా ఎంత శ్రద్ధ వహిస్తాడో అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం చిరంజీవి అటువంటి శ్రద్ధనే తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ పట్ల కూడా చూపెడుతున్నాడు.  ఈమధ్యనే తన మెగా మేనల్లుడికి ఈమెగా స్టార్ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' మూవీ షూటింగ్‌లో హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్ జరుగుతున్న స్పాట్ లో సడెన్‌గా ప్రత్యక్షమైన తన మామయ్య చిరంజీవిని చూసిన సాయి ధరమ్ తేజ్ షాక్ అయ్యాడు. అంతేకాదు అతడితో పాటు ఆ ఫిలిం యూనిట్ మొత్తం కూడా ఈ అనుకోని అతిధిని చూసి ఆశ్చర్యపోయాడని వార్తలు వస్తున్నాయి. షూటింగ్ స్పాట్ రావడమే కాకుండా ఆ సినిమా కథ గురించి ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తీరుతెన్నులు గురించి చిరంజీవి గుచ్చిగుచ్చి తన ప్రశ్నలను ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ ను అడిగాడని టాక్. అంతేకాదు ఈ సినిమా హీరోయిన్ రెజీనాతో అలాగే తదితర నటీనటులతో చిరంజీవి జోక్స్ వేస్తూ కొంత సమయాన్ని ఈసినిమా షూటింగ్ లో గడిపాడట.  దీనిని బట్టి చూస్తూ ఉంటే సాయి ధరమ్ తేజ్ కెరియర్ గురించి చిరంజీవి చాల సీరియస్ గా ఆలోచించడమే కాకుండా అతడి భవిష్యత్ గురించి పెద్ద వ్యూహాత్మక ఎత్తుగడలలో చిరంజీవి ఉన్నాడు అని అనిపిస్తోంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: