సినిమాల మధ్య పోటీ విపరీతంగా పెరిగి పోవడంతో ప్రస్తుతం ఒక సినిమా తీయడం ఎంత కష్టం అయిపోతోందో అన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఎంతో కష్టపడి తీసిన ఆ సినిమాను సరైన టైమ్ లో విడుదల చేసి హిట్ టాక్ తెచ్చుకోవడం కూడా చాల వ్యూహాత్మకంగా మారిపోతోంది. అందుకే టాప్ హీరోలు అంతా తమ అభిమానుల అభిరుచులను ఎప్పటికప్పుడు పసికడుతూ వారికి నచ్చిన సినిమాలలో చేసి వారి అభిమానాన్ని మరింత పొందడానికి అనునిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు.  అయితే ఈ వ్యవహారంలో మెగా కాంపౌండ్ తీరుతెన్నులు వేరు. ముఖ్యంగా మెగా స్టార్ చిరంజీవి వీలు దొరికినప్పుడల్లా తన అభిమాన సంఘాల నాయకులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వాళ్ళను తన కను సన్నలలో ఉంచు కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు అటువంటి సందర్భమే మరొకటి జరిగింది అని వార్తలు వస్తున్నాయి.  ఫిలింనగర్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు ఈరోజు ఉదయం చిరంజీవి హైదరాబాద్ లో రాష్ట్ర వ్యాఫంగా ఉన్న తన అభిమాన సంఘాల నాయకులతో భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది చిరంజీవి వీరాభిమానులు వచ్చినట్లు టాక్. అయితే ఏ అంశం మీద వీరు కలిసి చర్చించుకున్నారు అనే విషయం పై ఇంకా స్పష్టత రాలేదు. కాని వినపడుతున్న వార్తల ప్రకారం నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినిమా ‘ముకుంద’ 24న విడుదల అవుతున్న నేపధ్యంలో ఈ సినిమాకు పోటీగా నితిన్ నటించిన ‘చిన్న దాన నీకోసం’ క్రిస్మస్ రోజున విడుదల అవుతున్న నేపధ్యంలో ఒకే వారం రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి కాబట్టి ఆ ప్రభావం ‘ముకుంద’ ఫస్ట్ వీక్ ఎండ్ కలెక్షన్స్ పై ఎటువంటి ప్రభావం చూపెట్టకుండా మెగా అభిమానులందరినీ ఉత్సాహ పరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసారు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనినిబట్టి చూస్తూ ఉంటే పైకి చెప్పకపోయినా నితిన్ మెగా కాంపౌండ్ కు గట్టి షాక్ ఇచ్చాడు అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: