ఈరోజు ఉదయం ఇరు రాష్ట్రాలలోను భారీ అంచనాలతో విడుదలైన ‘ముకుంద’ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వైపు చలి వనికిస్తున్నా ఆ చలిని కూడా లెక్క చేయకుండా మెగా అభిమానులు ‘ముకుంద’ సినిమా టిక్కెట్ల కోసం తెల్లవారు ఝాము నుండి ధియేటర్ల వద్ద టిక్కెట్ల కోసం బారులు తీరిన దృశ్యాలు ఇరు రాష్ట్రాలలోని అనేక నగరాలలో కనిపించినట్లుగా వార్తలు వస్తున్నాయి.  సామాన్యంగా కొత్త హీరోల సినిమాలకు ఆ సినిమాల టాక్ తెలిసిన తరువాత కానీ జనం ధియేటర్ల వద్ద క్యూ కట్టారు. అయితే మెగా స్టామినాను తెలియ చేస్తూ వరుణ్ తేజ్ సినిమా ‘ముకుంద’ సినిమా టిక్కెట్లకు మొదటి షో నుండి విపరీతమైన క్రేజ్ ఏర్పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తలు ఇలా ఉండగా మొన్న హైదరాబాద్ లో జరిగిన మెగా అభిమానుల సమావేశంలో పాల్గొన్న ఒక మెగా వీరాభిమాని వరుణ్ తేజ్ కు సంబంధించి ఇచ్చిన సలహా నాగబాబుకు ఆశ్చర్య కలిగించింది అని టాక్. ఇప్పటికే నాగబాబును మెగా అభిమనులు మెగా ప్రిన్స్ అని ముద్దుగా పిలుచుకుంటున్న నేపధ్యంలో ఆ పిలుపు పై ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు కొంత అసంతృప్తి కలిగిన నేపధ్యంలో ఈ పిలిపు కన్నా ‘ఆరడుగుల బుల్లెట్’ అని వరుణ్ తేజ్ ను మెగా అభిమానులందరూ పిలిస్తే బాగుంటుంది అని ఇచ్చిన సలహా నాగబాబును ఆకర్షించింది అని టాక్. ‘ముకుంద’ కు భారీ ఓపెనింగ్స్ వచ్చిన నేపధ్యంలో వరుణ్ తేజ్ మొదటి పరీక్ష నేగ్గాడనే అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: