దక్షిణాది సినిమా రంగాన్ని సూపర్ స్టార్ గా సాసించడమే కాకుండా దక్షిణాది హీరోలలో అత్యధిక పారితోషికం తీసుకునే రజినీకాంత్ ఆర్ధిక సమస్యలలో ఉన్నాడు అంటే ఎవ్వరూ నమ్మని విషయం అయితే రజినీకాంత్ ఒక బ్యాంక్ కు చెల్లించవలసిన అప్పును సక్రమంగా చెల్లించని కారణంగా ఆ అప్పుకు హామీగా ఇచ్చిన రజనీకాంత్ ఆస్థులను వేలం వేస్తున్నట్లు ఈరోజు మీడియాలో వస్తున్న వార్తలు షాకింగ్ గా మారాయి.  ఇక వివరాలలోకి వెళితే ఎగ్జిమ్ బ్యాంకుకు బాకీ ఉన్న 22 కోట్లు చెల్లించని కారణంగా రజినీ ఆస్తులను వేలం వేయనున్నట్లు ఆ బ్యాంక్ అధికారులు ఒక ప్రకటన జారీ చేసారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం విడుదలైన ‘కొచ్చాడియన్’ సినిమాకు రజినీ భార్య లత నిర్మాతగా వ్యవహరించడంతో ఆ సినిమా నిర్మాణానికి తీసుకున్న అప్పుకు సంబంధించిన వ్యవహారం ఇది అనే వార్తలు కూడా ఉన్నాయి.  ఏది ఎలా ఉన్నా ఎప్పుడూ లేని విధంగా ఒకే సంవత్సరం రజినీకాంత్ నటించిన రెండు సినిమాలు విడుదల అయినా అవి విజయవంతం కాకపోవడంతో రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ ను కూడా ఆర్ధిక సమస్యలు వెంటాడటం అందర్నీ ఆశ్చర్య పరుస్తున్న విషయం..   

మరింత సమాచారం తెలుసుకోండి: