వెరైటీ సినిమాలు తీయడంలోనే కాదు వెరైటీ సినిమాలలో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న మంచు లక్ష్మికి టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఆమె వంశీ కృష్ణ దర్శకత్వంలో ఒక వెరైటీ కథాంశంతో కూడుకున్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అడవి శేషు హీరోగా మంచు లక్ష్మి పక్కన నటిస్తున్నాడు.  అయితే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో రానా నటిస్తున్నాడు. రానా ఈ సినిమాలో నటించేది కేవలం కొద్ది నిముషాలు మాత్రమే అయినా ఆ పాత్ర ఆ సినిమా కథకు ఒక ట్విస్ట్ ఇస్తుందని సమాచారం. మొదట్లో ఈ పాత్రని చేయడానికి రానా అంగీకరించపోయినా మంచు లక్ష్మి అభ్యర్ధన మేరకు రానా ఈ ప్రత్యేక పాత్రను నటించడానికి ఒప్పుకున్నాడు అని టాక్. ముగిసి పోతున్న 2014 రానా కు కెరియర్ పరంగా పెద్దగా కలిసి రాక పోయినా రానున్న 2015 లో విడుదల కాబోతున్న ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ సినిమాలు రానా స్థాయిని టాలీవుడ్ లోనే కాదు మిగతా భాషల సినిమా రంగాలలో కూడా పెంచుతాయి అనే గంపెడు ఆశలతో రానున్న 2015 గురించి ఎదురు చూస్తున్నాడు రానా..

మరింత సమాచారం తెలుసుకోండి: