టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లోకూడా క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు గాంచిన దేవిశ్రీప్రసాద్ పేరు వింటే యూత్ చిందులు వేస్తారు. ఇక అతడు స్వర పరిచిన పాటల సంగతి చెప్పనే అక్కరలేదు. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే సినిమాకు కోటి రూపాయల దాకా దేవిశ్రీ డిమాండ్ చేస్తున్నాడు అనే వార్తలు వున్నాయి. అటువంటి దేవిశ్రీకి హీరోయిన్ ఛార్మీ బుల్లితెర పై ప్రసారమవుతున్న ఒక షోలో ఒక సలహా ఇచ్చి ఆ షోను చూస్తున్న వారికే కాదు ఏకంగా దేవిశ్రీ ప్రసాద్ కే షాక్ ఇచ్చింది. మొన్న శనివారo శనివారం జీ తెలుగు‌లో టెలికాస్ట్ అయిన యాంకర్ ప్రదీప్ షో ' కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా'కు గెస్ట్‌గా వచ్చిన చార్మి దేవిశ్రీప్రసాద్ పై చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్య పరిచాయి. టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్స్ లిస్టు‌లో అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాల్సిన సెలెబ్రిటీ ఎవరని యాంకర్ ప్రదీప్ అడిగిన ప్రశ్నకు చార్మి ఒక్క నిముషం కూడా ఆలోచించకుండా వెంటనే పెళ్ళి చేసుకోవలసిన లిస్టులో దేవిశ్రీప్రసాద్ ది అగ్రస్థానం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఛార్మీ.  ఆమధ్య చార్మీకి దేవిశ్రీకి ప్రేమ వ్యవహారం నడుస్తోందని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఆ వార్తలను ఖండించే ఉద్దేశ్యంతో ఛార్మీ ఇటువంటి సలహా ఇచ్చిందా? లేదంటే వారిద్దరి ప్రేమ వ్యవహారం ఆగిపోయింది కాబట్టి కోపంతో దేవిశ్రీకి ఇటువంటి సలహా ఇచ్చిందా? అని ఈషోను చూసిన చాలామంది సెటైర్లు వేసుకున్నట్లు టాక్..   

మరింత సమాచారం తెలుసుకోండి: