ఇప్పటికే తెలుగు సినిమా రంగంలో అక్కినేని, నందమూరి, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవిల వారసులు టాలీవుడ్ ను షేక్ చేస్తున్న నేపధ్యంలో ఒకప్పుడు తెలుగు సినిమా సోగ్గాడు గా టాలీవుడ్ ను ఏలిన శోభన్ బాబు నట వారసత్వానికి కూడా వారసుడు వస్తున్నాడు. శోభన్ బాబు సోదరి తనయుడు రాజా బాబు కథా నాయకుడిగా ‘మేనల్లుడా మజాకా’ అనే సినిమా శోభన్ బాబు 79వ పుట్టినరోజునాడు ప్రారంభం అయింది.  ఈసినిమాలో ఈ కొత్త హీరోతో పాటు ‘నేను నేను రామునే’ సినిమాలో నటించిన వెంకట్ కూడా నటిస్తున్నాడు. సత్యనారాయణ పెండ్రు అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడని టాక్. లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్ తో కూడిన కథతో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు ఈ సినిమా యూనిట్ తెలియచేస్తోంది.  సినిమా రంగంలో తన వారసులు ఉండటానికి ఇష్టపడని శోభన్ బాబు తాను జీవించి ఉన్నంత కాలం తన కొడుకుని, మనవడుని సినిమా రంగానికి చాల దూరంలో ఉంచాడు శోభన్ బాబు. అయితే అదే శోభన్ బాబు వారసత్వాన్ని కొనసాగిస్తాను అని ఈరోజు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ యంగ్ హీరో రాజాబాబు శోభన్ బాబు అభిమానులను అలరిoచగలడా అన్నదే ప్రశ్న..

మరింత సమాచారం తెలుసుకోండి: