టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పెద్ద హీరోలలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్. తను నటిస్తున్న మూవీ ఏదైనా, బాక్సాపీస్ వద్ద ఓపెనింగ్స్ అధిరిపోవల్సింది. కాకాపోతే గత కొంత కాలంగా బాక్సాపీస్ వద్ద, మోత మ్రోగించే మూవీని మాత్రం తను నిరూపించుకోలేకపోతున్నాడు. దీంతో ఈసారి పూరీ జగన్నాధ్ తో జతకట్టి, ఎలాగైనా బాక్సాపీస్ వద్ద, బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలవాలని జూనియర్ ఆలోచిస్తున్నాడు. పూరీ జగన్నాధ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న టెంపర్ మూవీపై ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరి ద్రుష్టి ఉంది. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ, అనుకోని విధంగా వాయిదా పడి, అభిమానుల ఆశలకి నిరాశ మిగిల్చింది. ఎన్నో అంచానలతో అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడంతో, టెంపర్ మూవీ బాక్సాపీస్ వద్ద ఎటువంటి రిజల్ట్ ని పొందుతుంతో అని జూనియర్ టెన్షన్ పడుతున్నట్టు, క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే, మూవీని స్పీడ్ గా షూట్ చేయకుండా, క్వాలిటితో తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాధ్. టెంపర్ మూవీ ఆడియోని ఈ నెల 26న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా పూరీ జగన్నాధ్ కి, జూనియర్ ఓ విషయాన్ని స్పెషల్ గా చెప్పాడంట. “టెంపర్ మూవీ బాక్సాపీస్ బ్లాక్ బస్టర్ కాకపోయినా పర్వాలేదు కాని, మూవీని కొన్న అందరూ లాభాలతో హ్యాపీగా ఉండాలని” చెప్పుకొచ్చినట్టుగా ఫిల్మ్ నగర్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: