విలక్షణ దర్శకుడు తేజ టాలీవుడ్ కు పరిచయమై ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా మరెన్నో మంచి సినిమాలకు గతంలో దర్శకత్వం వహించినా టాలీవుడ్ టాప్ దర్శకుల రేసులో ఎప్పుడు మొదటి వరసలో లేడు. కాని ఆయన శైలికి అనుగుణంగా ప్రతి సంవత్సరం ఎదో ఒక సినిమాను తీయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు.

తేజ తాజాగా అంతా కొత్తవారితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆడిషన్స్ కూడా పూర్తి చేశాడు అని టాక్. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. టాప్ హీరోల చుట్టూనే కాదు టాప్ ఆర్టిస్టుల చుట్టూ కూడా తేజా వారి డేట్స్ కోసం ప్రదక్షిణాలు చేయడు.

అంతేకాదు తనకు అనుకూలంగా ఉండే నటీనటులతోనే తేజ సినిమాలు తీస్తూ కాలం గడిపేస్తూ ఉంటాడు. ఈ నేపధ్యంలో తేజా ప్రస్తుతం ఒక నిర్మాతను విలన్ గా మార్చేస్తున్నాడు అనే వార్తల హడావిడి వినిపిస్తోంది. ‘ద్రోణ’, ‘చమ్మక్ చల్లో’, ‘మిస్టర్ నూకయ్య’ వంటి సినిమాలను నిర్మించిన నిర్మాత డి.ఎస్.రావును తేజ విలన్ గా మార్చేస్తున్నాడు అని టాక్.

దీనితో తేజ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీలో డి.ఎస్.రావు విలన్ గా నటిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. దీనికోసం డి.ఎస్.రావు గెటప్, లుక్, బాడీ లాంగ్వేజ్ మొత్తం తేజా మార్చేస్తున్నాడట. హీరో గోపీచంద్ ను విలన్ గా టాలీవుడ్ కు పరిచయం చేసి సంచలనం సృస్టించిన తేజ ఈ నిర్మాతను కూడా విలన్ గా మార్చి ఇంకా ఎన్ని సంచలనాలు చేస్తాడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: