విజయవాడకు మహేష్ బాబుకు చాల అవినాభావ సంబంధం ఉంది. గతంలో మహేష్ సినిమాలకు సంబంధించిన విజయోత్సవాలు విజయవాడలో చాల ఘనంగా జరిగాయి. ఈమధ్యనే మహేష్ తన ధమ్సప్ బ్రాండ్ ఎండార్స్ మెంట్ కార్యక్రమం కోసం విజయవాడ వచ్చి సందడి చేసినప్పుడు విపరీతంగా మహేష్ అభిమానులు హడావిడి చేసారు.

ఇప్పుడు మహేష్ మళ్ళీ విజయవాడలో తన బావ కోసం సందడి చేయబోతున్నాడు. యంగ్ హీరో సుదీర్ బాబు తనకు అదృష్టాన్ని ఇచ్చిన హీరోయిన్ నoదితతో కలిసి నటించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ ఆడియో వేడుక ఈనెల 25వ తారీఖున విజయవాడలో జరగబోతూ ఉండటంతో ఆ వేడుకకు ముఖ్య అతిధిగా మహేష్ వస్తున్నాడని టాక్.

ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాత లగడపాటి శ్రీధర్ సొంత ఊరు విజయవాడ కావడంతో పాటు ఈ సినిమా టైటిల్ లోని కృష్ణమ్మ ప్రవహించే ప్రదేశం విజయవాడ కావడంతో సెంటిమెంట్ గా ఈ సినిమా ఆడియో వేడుకను చాల ఘనంగా విజయవాడలో నిర్వహించడానికి ఈ సినిమా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాతగా 10 సంవత్సరాల ప్రస్థానం లగడపాటి శ్రీధర్ కు పూర్తి కావడంతో ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఆడియో వేడుక విజయవాడలో ఏర్పాటు చేసారని తెలుస్తోంది.

ఈమధ్యకాలంలో సరైన హిట్స్ లేక బాధ పడుతున్న సుదీర్ బాబు క్రేజ్ పెంచడానికి మహేష్ ఈ ఆడియో వేడుకకు రావడం ద్వారా తన వంతు సహాయం చేస్తున్నాడు. కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘చార్మినార్’ సినిమాకు రీమేక్ గా తీసిన ఈ సినిమా పై సుదీర్ బాబు చాల ఆశలే పెట్టుకున్నాడు. మహేష్ బాబు ఈ సినిమాలో ఒక ప్రత్యేక గెస్ట్ రోల్ లో కనిపిస్తాడు అని ప్రచారం జరుగుతున్న ఈ సినిమా వచ్చే నెలలో రాబోతున్న ప్రేమికుల రిజున విడుదల కాబోతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: