ఒకప్పుడు టాలీవుడ్ గ్లామర్ క్వీన్ గా టాప్ హీరోలందరితోను నటించి మెప్పించిన శ్రియ వెంకటేష్ నాగార్జునల పై తీవ్రమైన కోపంగా ఉంది అనే వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీతో తన ప్రాభవాన్ని కోల్పోయిన శ్రియ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ‘మనం’ సినిమాతో విజయవంతంగా మళ్ళీ మొదలు పెట్టింది. ‘మనం’ మంచి సక్సస్ అవడంతో తనకు సీనియర్ హీరోల పక్కన అవకాశాలు వస్తాయని తెగ ఆశ పడింది శ్రియ.

ఆ ఆశలు పగటి కలలుగానే మిగిలి పోవడంతో కనీసం తాను నటించిన ‘గోపాల గోపాల’ విడుదలైన తరువాత అయినా టాలీవుడ్ టాప్ హీరోలు తనను పట్టించు కుంటారు అని ఆశ పడిందట శ్రియ. గోపాలుడు ఒక మోస్తరుగా విజయాన్ని సాధించి విమర్శకుల ప్రశంసలు పొందినా ఎక్కడా తన ప్రస్తావన లేకపోవడం షాకింగ్ గా మారిందట శ్రేయకు.

అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్ కు తాను వస్తానని ఈ సినిమా దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపినా కనీసం ఛానల్స్ లో జరుగుతున్న ఈ సినిమా పబ్లిసిటీలో కనీసం తన పేరును కూడా ప్రస్తావించక పోవడం శ్రియను నిరాశ పరుస్తోంది అని టాక్. ‘మనం’, ‘గోపాల గోపాల’ సినిమాలకు అతి తక్కువ పారితోషికానికి తాను నటించినా ఈ సినిమాల విజయం తన కెరియర్ కు ఏ విధంగాను పనికి రాకుండా పోయిందని శ్రియ తన సన్నిహితుల దగ్గర బాధ పడుతోందట.

టాలీవుడ్ సీనియర్ హీరోలు త్రిష లాంటి క్రేజ్ లేని హీరోయిన్స్ కు కోటి రూపాయల పారితోషికాన్ని ఇచ్చి ఆమెచేత నటింప చేస్తూ ఉంటే నటిగా, మంచి డాన్సర్ గా మంచి పేరు ఉన్నా తన పేరును కూడా టాలీవుడ్ సీనియర్ హీరోలు గుర్తించడంలేదు అని గగ్గోలు పెడుతోందట శ్రియ..

మరింత సమాచారం తెలుసుకోండి: