సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుపుకుంది. రీసెంట్ గా ఫారిన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకువచ్చిన ఈ మూవీ, ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడ ప్రారంభించింది. అయితే ఈ మూవీని వేసవిలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు దర్శకుడు కొరటాలశివ, మూవీ కొద్దిగా లేటు అవ్వొచ్చు అనే డౌట్ ని వ్యక్తం చేశాడంట. దీంతో మహేష్ బాబు, “మూవీ ఎట్టిపరిస్థితుల్లో సమ్మర్లో రిలీజ్ కావాలని” కొరటాల శివకి స్ట్రిక్ట్ గా చెప్పాడంట. కొరటాల శివ ఇప్పటి వరకూ ఎక్కువ షెడ్యూల్స్ ని ఫ్లాన్ చేసుకోగా, వాటిని ఆపేసి, భారీ షెడ్యూల్స్ ని రెడీ చేసుకుంటున్నాడు. ఈ మూవీలో మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి మంచి ట్యూన్స్ అందించాడంటూ, ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. మిర్చి’ సినిమాతో కొరటాల శివ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ సినిమా తరువాత భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న మూవీగా మహేష్ మూవీకి ఫుల్ క్రేజ్ ఏర్పడుతుంది. మొత్తానికి సమ్మర్లో మహేష్ బాబు, తన మూవీని రిలీజ్ చేసుకోవాలని చూడటంతో, దర్శకుడు ఇంకాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇలా డైరెక్టర్ కి డెడ్ లైన్ ఇవ్వడం అనేది, ప్రిన్స్ కి ఇదే మొదటిసారి అని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: