సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేకమైన స్టార్ డం ని క్రియేట్ చేసుకున్న యాక్టర్ శ్వేతబసు ప్రసాద్. అయితే గత కొంత కాలంగా తను చాల సమస్యలను ఎదుర్కొంటున్నారనే చెప్పవచ్చు. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో తనపై ఓ ప్రత్యేకమైన ముద్ర పడటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఓ రీజనల్ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ కారణంగా తను అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుందని ఆ ఛానల్ చెప్పుకొచ్చింది. అయితే, కొంత కాలం తరువాత పోలీసులు శ్వేతబసుని రైడింగ్ లో పట్టుకోవడం, కోర్జు నిర్ధోషిగా తీర్పు ఇవ్వడం వంటి విషయాలు తెలిసిందే. తను నిర్ధోషి అని కోర్టు చెప్పినప్పటికీ, ఫిల్మ్ ఆఫర్స్ మాత్రం తనకి తక్కువుగానే వస్తున్నాయి. వచ్చిన కొద్ది ఆఫర్స్ సైతం ఐటెం సాంగ్స్ కోసం రావడంతో, తను ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చింది. ఇదే సమయంలో హిందీకి సంబంధించి ఓ ఛానల్ నిర్వహిస్తున్న అడల్డ్ షోకి, శ్వేతాబసు హోస్ట్ గా ఉండాలని తనని అప్రోచ్ అయింది. అయితే, ఆ షో కాన్సెప్ట్ విన్నతరువాత, తను ఆ షోని చేయలేను అని శ్వేతాబసు చెప్పుకొచ్చింది. శ్రుంగారానికి సంబంధించిన విషయాలను తను ఆ షోలో పబ్లిగ్గా అగాల్సిరావడం అనేది తనకి ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పుకొచ్చింది. షో నిర్వాహకులు మాత్రం, తను ఈ షోకి హోస్ట్ చేస్తే దాదాపు 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన నిర్ణయం పెండింగ్ లో ఉందని కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: