సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇపుడు అందరి కళ్ళు అమీ జాక్సన్ పైన పడ్డాయి. తాజాగా తను నటించిన ఐ చిత్రం, బాక్సాపీస్ వద్ద హిట్ కాకపోయినా తనకి మాత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. దీంతో ఈ బ్యూటీకి సౌత్ లో ఆఫర్స్ వెల్లువ మొదలైంది. తెలుగులో 'ఎవడు' సినిమాలో నటించిన అమీ జాక్సన్‌ అందాల విందుకే పరిమితమైంది. కాని శంకర్‌ 'ఐ' సినిమాలో అందంతో పాటు యాక్టింగ్ లోనూ ప్రతిభ చూపింది. అమీజాక్సస్ కోలీవుడ్ లో 'మదరాసి' సినిమాలో చేసింది. తన మొదటి మూవీలతోనే డెబ్యూ యాక్ట్రెస్‌గా విజయ్‌ అవార్డ్‌ దక్కించుకుంది. తరువాత 'తాండవన్‌' మూవీలో విక్రమ్‌ సరనస చేసింది. అలా కోలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ బ్రిటీష్ బ్యూటి. ఇదిలా ఉంటే టాలీవుడ్ లోనూ అమీజాక్ససన్ ఓ హాట్ ఆఫర్ ని అందుకుంది. ప్రిన్స్ మహేష్ బాబు నటించబోతున్న అప్ కమింగ్ మూవీలో అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తుందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ మూవీ అనంతరం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటిస్తాడు. శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు కాంబినేషన్ లో హీరోయిన్ గా అమీజాక్సన్ ఎంపిక అయిందంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన న్యూస్ ని అఫిషియల్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. కొరటాల శివ మూవీకి షూటింగ్ పూర్తవగానే సమ్మర్లో శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబుల షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఫిల్మ్ ఇండస్ట్రీ రిపోర్ట్. 

మరింత సమాచారం తెలుసుకోండి: