ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు దక్షిణాది సినిమాల హీరోయిన్ కోలీవుడ్ బ్యూటీ త్రిష ఎంగేజ్ మెంట్ చెన్నైలోని ఒక ప్రముఖ నక్షత్రాల హోటల్ లో ఘనంగా జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. గత కొద్ది కాలంగా త్రిష పెళ్ళికి సంబంధించిన వార్తలు మీడియాలో వస్తున్నా ఈమధ్య వరకు వాటిని ఖండిస్తూనే వచ్చింది త్రిష.

అయితే అందరి ఊహలకు ట్విస్ట్ ఇస్తూ కోలీవుడ్ నిర్మాత మరియు ప్రముఖ డైమoడ్ ఎక్స్ పోర్టర్ వరుణ్ ను తాను పెళ్ళి చేసుకోబోతున్నానని ప్రకటించటమే కాకుండా ఆ పెళ్ళికి సంబంధించిన నిశ్చతార్ధ వేడుకను కూడా త్రిష ఈరోజు చెన్నైలో తన బంధుమిత్రుల మధ్య జరుపుకుంది.

అయితే ఈ వేడుకకు సినిమా రంగానికి చెందిన ఎవరినీ పిలవకుండా జరుపుకోవడం విశేషం. ఇదే సంవత్సరం చివరిలో వీరి వివాహం ఉంటుంది అని అంటున్నారు. ప్రేమికులుగా ఉండగానే తాజ్ మహల్ వద్ద సందడి చేసిన ఈ ప్రేమ జంట పెళ్ళి పూర్తి అయ్యాక ఇంకా ఎన్ని ప్రదేశాలలో సందడి చేస్తారో చూడాలి.

ప్రస్తుతం త్రిష బాలయ్యతో కలిసి నటిస్తున్న ‘లయన్’ రాబోతున్న మార్చిలో విడుదల కాబోతు ఉన్న నేపధ్యంలో ఈ సినిమా త్రిష ఊహించిన విధంగా సూపర్ హిట్ అయితే అటు సినిమాలు పరంగా ఇటు పెళ్ళి పరంగా త్రిషకు బాగా కలిసి వచ్చిన సంవత్సరంగా ఈ 2015 ఆమె జీవితంలో ఒక మర్చిపోలేని సంవత్సరంగా మిగిలి పోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: