ఒకనాటి యాంగ్రీ హీరో రాజశేఖర్ ప్రస్తుతం టాలీవుడ్ లో సరైన అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అయితే రాజశేఖర్ లోని మరో కోణాన్ని బయట పెడుతూ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఒక ఆ శక్తికర కథనాన్ని ప్రచురించింది. రాజశేఖర్ మంచి అలోపతి డాక్టర్ అన్న విషయం ఓపెన్ సీక్రెట్. అయితే ఈమధ్య కాలంలో మంచి హొమియోపతి డాక్టర్ గా రాజశేఖర్ మారిపోయాడు అనే వార్తలు వస్తున్నాయి.

చాలామంది టాలీవుడ్ సెలెబ్రేటీలు తమకు తగ్గని దీర్ఘకాలిక వ్యాధుల గురించి రాజశేఖర్ వద్ద హోమియోపతి వైద్యం చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో చనిపోయిన ఆహుతి ప్రసాద్ రాజశేఖర్ వద్ద తన చివరి రోజులలో హోమియోపతి మందులు వాడినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని అయితే అప్పటికే ఆ వ్యాధి ముదిరి పోవడంతో ఎటువంటి ప్రయోజనం సమకురాలేదని రాజశేఖర్ అంటున్నాడు.

అదేవిధంగా తాను హోమియోపతి, ఆయుర్వేద, యునానీ, చైనా వైద్యం విషయాలకు సంబంధించి అనేక పుస్తకాలను చదివి తాను ఎంతోమంది టాలీవుడ్ యాకట్టర్లకు మందులు ఇస్తున్నానని చెపుతున్నాడు. అంతేకాదు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ప్రముఖ నిర్మాత రామానాయుడు కూడా తన వద్ద మందులు తీసుకుంటున్నారని ఆ మందులు వాడిన తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడింది అని అంటున్నాడు రాజశేఖర్.

గతంలో అల్లురామలింగయ్య జీవించి ఉన్న రోజులలో ఈ విధంగానే అల్లు తన హోమియోపతి వైద్యం ద్వారా అందరికీ సేవలు అందించే వారు. ఇప్పుడు ఆ స్థానాన్ని రాజశేఖర్ భర్తీ చేసాడు అంటూ కామెంట్లు వినపడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: