ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డం వచ్చేంత వరకు కష్టపడితే చాలు, ఆ తరువాత ఆఫర్స్ అనేవి వెతుక్కుంటూ వస్తుంటాయి. అలా అని స్టార్ డం సంపాదించుకున్న తరువాత, ఇష్టం వచ్చినట్టుగా ఉంటే, అప్పటి వరకూ సంపాదించుకున్న స్టార్ డం అంతా సర్వనాశనం అయిపోయినట్టే. విషయంలోకి వెళితే, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెం.1 వన్ పొజిషన్ లో ఉన్న హీరో ధనుష్, తాజాగా కమర్షియల్ బ్రాండ్స్ కి వరుసగా అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాడు.

వెరీ రీసెంట్ గా తను సెవెన్ అప్ కూల్ డ్రింగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. ఓ సంవత్సరం పాటు తను ఈ బ్రాండ్ కి అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు. ఇందు కోసం తను ఏకంగా అయిదు కోట్ల రూపాయలను చార్జ్ చేసినట్టు కోలీవుడ్ లో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి.

ధనుష్ ఇప్పటి వరకూ తీసుకున్న యాడ్స్ రెమ్యునరేషన్ లో, తను ఇప్పుడు తీసుకున్న సెవెన్ అప్ యాడ్ రెమ్యునరేషనే చాలా ఎక్కువట. తను తాజాగా నటించిన సినిమా తెలుగులోకి రఘవరన్ బి.టెక్ పేరుతో డబ్ అయితే, ఇటు తెలుగులోనూ, తమిళ్ లోనూ ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే మరో రెండు నెలలో ధనుష్ మరో మూడు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఎంపికయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే ధనుష్ చెబుతున్న రెమ్యునరేషన్ ఎక్కువుగా ఉన్నప్పటికీ, వారు మాత్రం ధనుష్ తోనే వారి బ్రాండ్స్ ని ప్రమోట్ చేసుకోవాలని చూస్తున్నారంట. మొత్తంగా కోలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా మారటమే కాకుండా, కమర్షియల్ ఎండోర్స్ మెంట్ ని చేజిక్కించుకోవటంలోనూ నెంబర్ వన్ గా మారాడు అని కోలీవుడ్ సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: