మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అనుసరిస్తున్న ఒక మాస్టర్ ప్లాన్ టాలీవుడ్ టాప్ యంగ్ హీరోలను కలవరపాటుకు గురి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా రామ్ చరణ్ సినిమాలలో నటించకుండా షూటింగ్ లకు దూరంగా ఉంటున్నా చరణ్ అనుసరిస్తున్న ప్లాన్ టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. గత రెండు నెలలుగా రామ్ చరణ్ రెండు వారాలకు ఒకసారి ఇరు రాష్ట్రాలలోని తన అభిమానులను హైదరాబాద్ పిలిపించుకుని తన తండ్రి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆఫీసులో వారిని కలుస్తున్నాడని వార్తలు వినపడుతున్నాయి.

అంతేకాదు వారితో కలిసి తన సినిమాల విషయమై మాటలు కలపడమే కాకుండా తాను ఎటువంటి సినిమాలలో నటిస్తే వారికి బాగుంటుందో అభిమానుల సలహాలను తీసుకుంటూ వారితో తన బంధాన్ని పెంచుకోవడమే కాకుండా వారితో భోజనం చేస్తూ, ఫోటోలు తీయించుకుంటూ ఆటోగ్రాఫ్ లు ఇచ్చే పద్ధతిని ప్రారంభించాడట రామ్ చరణ్. ఇప్పటికే ఇటువంటి సమావేశాలు ఒక మూడు జరిగాయని వార్తలు వస్తున్నాయి.

గతంలో చిరంజీవి మెగా స్టార్ గా టాలీవుడ్ ను ఏలిన రోజులలో చిరంజీవి ఇటువంటి పద్ధతులను అనుసరించే వాడు. తిరిగి చిరంజీవి సలహాతో తనయుడు రామ్ చరణ్ తన ఫ్యాన్స్ అభిమానం తగ్గ కుండా ఈ వ్యూహాత్మక ఎత్తుగడను మళ్ళీ ప్రారంభించాడు అని టాక్. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యంగ్ హీరోలు ఎవ్వరూ తమ అభిమానులతో వ్యక్తిగతంగా కలవడం జరగని నేపధ్యంలో చరణ్ తన తండ్రి పద్ధతిని తిరిగి ప్రారంభించాడు అనుకోవాలి.

టాప్ యంగ్ హీరోల మధ్య పెరిగి పోయిన విపరీతమైన పోటీ నేపధ్యంలో చరణ్ ఎత్తుకున్న కొత్త ఎత్తుగడ చాలామంది యంగ్ హీరోలకు ఒక వైపు ఆ శక్తిని మరొక వైపు కలవర పాటుకు గురి చేస్తోందని టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: