నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాలలో ‘ఆదిత్యా 369’ ఒక విభిన్న చిత్రం. ఈ సినిమాలో శ్రీకృష్ణ దేవరాయలుగా బాలయ్య చూపించిన దర్పం సీనియర్ ఎన్టీఆర్ స్థాయిలో ఉంది అంటూ అప్పట్లో మంచి ప్రశంసలు కూడా వచ్చాయి.

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని బాలకృష్ణ ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నా ఆ సాహసం ఇప్పటి వరకు చేయలేకపోయాడు. అయితే ఈ సినిమా కథను పోలిన స్క్రిప్ట్ ను తాను నటిస్తున్న భారీ సినిమాగా విజయ్ ఒక ప్రయోగo చేస్తున్నాడు అంటూ కోలీవుడ్ టాక్.

బాలయ్య ‘ఆదిత్యా 369’ లో రెండు పాత్రలలో నటిస్తే కోలీవుడ్ హీరో విజయ్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘పులి’ సినిమాలో మూడు పాత్రలను చేస్తున్న ఈ సినిమా మూల కథలో ‘ఆదిత్యా 369’ ను పోలి ఉంటుందని టాక్. ఈ సినిమాలో విజయ్ రాజకుమారుడిగా, మరుగుజ్జుగా, ఆధునిక యువకుడిగా మూడు పాత్రలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

విజయ్ తో పాటుగా శ్రుతిహాసన్, హన్సిక, శ్రీదేవిలు నటిస్తున్న ఈ సినిమా కోలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఫ్యాంటసీ సినిమాగా రూపొందుతోంది. బాలకృష్ణ చేయలేక పోయిన ఫ్యాంటసీ సాహసాన్ని కోలీవుడ్ హీరో విజయ్ చేస్తూ ఉండటం బాలయ్యకు అనుకోని షాక్ అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: