ప్రపంచ వింతలలో ఒక వింతలా నిన్న సాయంత్రం మీడియాకు లీక్ అయిన వార్తను చూసిన ప్రతి వ్యక్తి ఆశ్చర్య పోయారు. పవన్ దాసరిల కలయికతో ఒక సినిమాను దాసరి తన సొంత నిర్మాణ సంస్థ తారక ప్రభు బ్యానర్ పై నిర్మిస్తున్నానని స్వయంగా దాసరి ప్రకటించిన వార్త చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక పవన్ అభిమానులైతే ఈవార్త విని మరింత షాక్ కు గురి అయ్యారని వార్తలు వస్తున్నాయి.

‘గబ్బర్ సింగ్ 2’ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్న పవన్ అభిమానులకు పవన్ దాసరిల మెగా ప్రాజెక్ట్, నిశ్శబ్ధంగా మీద పడ్డ పిడుగులా ఖంగారు పడుతున్నారు. గతంలో బాలకృష్ణతో ‘పరమవీరచక్ర’ సినిమాను తీసి బాలకృష్ణ అభిమానులు కూడా తట్టుకోలేని సినిమాగా మార్చేసిన దాసరి ఇప్పుడు టాలీవుడ్ ఎంపరర్ పవన్ తో ఇటువంటి ప్రయోగాన్ని ఎందుకు చేస్తున్నాడు, అసలు ఈ ప్రయోగానికి పవన్ ఎలా ఒప్పుకున్నాడు అన్న సమాధానం లేని ప్రశ్నలతో పవన్ అభిమానులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.

మరి కొందరు అయితే దాసరి వద్ద రెడీగా ఉన్న చిన్న సినిమా ‘నేరం’ స్క్రిప్ట్ ను పెద్ద సినిమాగా మార్చి ఏకంగా పవన్ పైనే బాణం వేశాడా అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈ కలయిక వెనుక ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది అనే వార్తలు కూడా వినపడుతున్నాయి. దాసరికి ఏనాటి నుండో టాలీవుడ్ ను ఏలుతున్న ‘ఆ నలుగురు’ పై విపరీతమైన కోపం. వారిని అడ్డుకోవాలని దాసరి ఎన్ని సార్లు ప్రయత్నించినా ఘోరంగా విఫలం అవుతున్నాడు. ఈ పరిస్థుతుల నేపధ్యంలో వారిని కట్టడి చేయాలి అంటే ఒక బలమైన అస్త్రం కావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ ను తన పాశుపతాస్త్రoగా మార్చుకుని ‘ఆ నలుగురు’ పై యుద్ధం చేయడానికి దాసరి పవన్ ల సినిమాను అస్త్రంగా ప్రయోగిస్తున్నాడా అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా పవన్ తన మౌనాన్ని వీడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మరియు రైతుల దయనీయ పరిస్థుతుల గురించి ట్విటర్ యుద్ధం ప్రారంభించిన నేపధ్యంలో త్వరలో తన ‘జనసేన’ తరఫున జనంలోకి వెళ్ళి కార్యకర్తలను ఏర్పరుచుకోవలసిన పరిస్థుతులు ఉన్న నేపధ్యంలో దాసరి సలహాలు ‘జనసేన’ కు ఉపయోగ పడతాయి అన్న ఉద్దేశ్యం కూడా వీరిద్దరి కలయికకు కారణమై ఉండవచ్చు అని అంటున్నారు. కారణాలు ఏమైనా దాసరి పవన్ ల కలయికతో సినిమా రాబోతూ ఉండటం టాలీవుడ్ ను షేక్ చేసే న్యూస్ అన్నది వాస్తవం..

మరింత సమాచారం తెలుసుకోండి: