నాగార్జున నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో ఇప్పటికే ఎంతోమంది సినిమా సెలెబ్రెటీలు అతిధులుగా వచ్చి నాగార్జునతో కలిసి ఆ ప్రోగ్రామ్ లో పాల్గొనడమే కాకుండా ఆ కార్యక్రమ రేటింగ్స్ పెంచడానికి తమవంతు సహకారం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈరోజు రాత్రి నాగార్జున కోటీశ్వరుడు ప్రోగ్రాంలో హీరో నాని అతిధిగా రాబోతున్నాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో లో నాని ఏకంగా నాగార్జున పై వేసిన సెటైర్లు అందరికీ ఆ శక్తి దాయకంగా ఉన్నాయి.

నాని నాగ్ తో ఈకార్యక్రమంలో మాట్లాడుతూ నాగార్జున భవిష్యత్ లో తన తమ్ముళ్ళు నాగచైతన్య, అఖిల్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేస్తే బాగుంటుందని నాని కామెంట్ చేసినప్పుడు నాగార్జున ఆనందంతో పరవసించిపోయాడు. అదేవిధంగా ఈకార్యక్రమంలో నాని తన భార్యతో తాను నడిపిన ప్రేమ వ్యవహారాన్ని కూడా ఈరోజు రాత్రి అందరితో షేర్ చేసుకోబోతున్నాడు.

నాని ప్రస్తుతం నటిస్తున్న ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా విషయాలను కూడా ఈ కార్యక్రమంలో నాగార్జునతో షేర్ చేసుకున్నాడు అని తెలుస్తోంది. ప్రస్తుతం మల్టీ స్టారర్ ల హవా నడుస్తోంది కాబట్టి నాని సలహాలను పాటించి నాగార్జున తన కొడుకులతో ఒక మల్టీ స్టారర్ తీసి మరో అక్కినేని రికార్డును క్రియేట్ చేస్తాడేమో చూడాలి.

నాగార్జున ‘మీలో ఎవరూ కోటీశ్వరుడు’ కార్యక్రమానికి వారానికి ఇద్దరు చప్పున సెలెబ్రెటీలను ఈ షోకు అతిధులుగా తీసుకు వస్తున్నా కోటీశ్వరుడి షో రేటింగ్స్ మాత్రం నాగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మరి కొద్ది రోజులలో ఈ షోను ముగిస్తారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: