విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళీ ఈరోజు ఒక ప్రాముఖ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా రంగం పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఏ విషయం పైన అయినా ముక్కు సూటిగా మాట్లాడే పోసాని మాటలు ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది డేగా మారాయి. తాను సినిమా పరిశ్రమకు డబ్బు సంపాదించడం కోసమే వచ్చానని తాను ఎవరికీ ఉచితంగా పని చేయననీ అందువల్ల తాను సమాజానికి ఎదో సేవ చేస్తున్నట్లు భావించడం లేదని అంటూ షాకింగ్ కామెంట్లు చేసాడు.

తనకు తల పొగరు అన్న విషయం పై స్పందిస్తూ తన జీవితంలో ఎంతో కష్టపడి ఎదిగానని అందువల్ల ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన తన మాటలు చాల మందికి తల బిరుసుగా కనిపిస్తాయని ఒక ఆఫీసులో ఆఫీసు బాయ్ గా పనిచేసిన తనకు డబ్బు విలువ ఏమిటో తెలిసి వచ్చేడట్లుగా తనను పరిస్థుతులు మార్చాయని కామెంట్లు చేసాడు పోసాని.

అంతేకాదు తనకు 30 లక్షల బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అయినా 30 కోట్ల బడ్జెట్ సినిమా అయినా సమానమే అని అంటూ తనకు సంబంధించినంత వరకు తన పాత్ర అదేవిధంగా తన పారి తోషికం మాత్రమే ప్రధానం అని అంటూ తనకు సినిమా రంగంలో స్నేహితులుకాని, విరోధులు కాని ఎవరూ లేరని ఉన్న వారంతా పరిచయస్తులే అని షాకింగ్ కామెంట్స్ చేసాడు పోసాని.

తాను లేటెస్ట్ గా నటించిన ‘టెంపర్’ సినిమాలో తన పాత్రను ప్రశంసిస్తూ ఇప్పటికి తనకు 2 వేల ఫోన్ కాల్స్ వచ్చాయి అని చెపుతున్నాడు. తాను కష్టపడి నటిస్తాను కాబట్టి తన పారితోషికం గురించి నిర్మాతల చుట్టూ తిరుగుతూ వారాలు నెలలు గడపవలసిన అవసరం తనకు లేదని తాను ఇలా స్పష్టంగా మాట్లాడుతాను కాబట్టే తనకు తల బిరుసు ఎక్కువ అంటూ కొంత మంది ప్రచారం చేస్తున్నారని అయినా తాను ఆ మాటలు పట్టించుకొను అని అంటూ తప్పు చేయను తప్పు చేసిన వాళ్ళను క్షమించను అని అంటున్నాడు పోసాని..

మరింత సమాచారం తెలుసుకోండి: