అనుష్కను హీరోయిన్ గా పెట్టి రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ‘సైజ్ జీరో’ సినిమాకు సంబంధించి ఒక ఆ శక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో పురుష రచయితల హవా నడుస్తున్న నేపధ్యంలో ఈ సినిమాకు కథను స్క్రీన్ ప్లేను అందిస్తున్నది ఒక మహిళా రచయిత్రి ఆమె పేరు కనిక ధిల్లాన్. ఈమె మరెవ్వరో కాదు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కెఎస్. ప్రకాష్ భార్య మరియు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కోడలు ఈమె.

ఈమధ్యనే ప్రారంభమైన ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి తరఫున పొట్లూరి ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు కథను అందించిన కనిక ధిల్లాన్ ఇప్పటికే రచయిత్రిగా తనను తాను నిరూపించుకుంది. ఇండియాలో బాగా సేల్ అయిన ‘బాంబే డక్ ఈజ్ ఎ ఫిష్’ అనే నవలను రాసి ఆమె పాపులర్ అయ్యింది.

అంతేకాదు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం’, ‘బిల్లు బార్బర్’, ‘రా వన్’ వంటి పెద్ద సినిమాలకు ఈమె కో-రైటర్ గా పనిచేసింది. ఆ అనుభవంతోనే ఇప్పుడు ఆమె అనుష్క చిత్రానికి కథను అందిస్తోంది. ఇంతేకాకుండా కనిక షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ లో క్రియేటివ్ కంటెంట్ డివిజన్ కి హెడ్ ఈమె తన సేవలు అందిస్తోంది.

చాల సంవత్సరాలు ప్రేమించుకున్నాక క్రితం సంవత్సరం 2014 లో ప్రకాష్, కనికల వివాహం జరిగింది. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ రైటింగ్ విషయంలో మంచి అనుభవం ఉన్న ఈమె అనుష్క నటిస్తున్న ‘సైజ్ జీరో’ సినిమాతో తన భర్త ప్రకాష్ కు ఎంత వరకు బ్రేక్ ఇస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: