స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ మద్య వచ్చిన రేసు గుర్రంతో మాంచి ఊపు మీద ఉన్నాడు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అత్తారింటికి దారేది సినిమాతో టాలీవుడ్ నే ఒక్క కుదుపు కుదిపేశాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (వర్కింగ్ టైటిల్) చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

చిత్రానికి సంబంధించి మెయిన షెడ్యూల్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతుందట. ఈ షెడ్యూల్ తో ఒక్క పాట షూటింగ్ మిన‌హ షూటింగ్ మెత్తం పూర్తవుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అందాల తారలు సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ... అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా రూపొందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటన ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్నాం. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అందాల భామలు సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం స్పెయిన్ లో పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ చిత్ర విశేషాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: