తెలుగు ఇండస్ట్రీలో విలక్షన నటుడు,కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రత్యేకమై అభిమానం పేరు కలిగిన వ్యక్తి. ఈయన ముగ్గరు పిల్లలు మంచు విష్షు, మనోజ్ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న ముగ్గురూ సినిమా ఇండస్ట్రీపై విపరీతమైన క్రేజ్ ఉన్నవారే అందుకే వారు హీరోలయ్యారు.

మంచు లక్ష్మీ మాత్రం నిర్మాతగా, నటిగా పేరు తెచ్చుకుంటుంది. కాకపోతే ఈ అమ్మడు ఏం చేసినా టాలీవుడ్ లో ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఫ్యాషన్ కి ఐకాన్ గా ఏ కార్యక్రమాలకు వెళ్లినా తనకంటూ ప్రత్యేక స్టయిల్ కనబరుస్తుంది మంచు లక్ష్మి. మరి మంచు వారి అమ్మాయి తాజాగా దొంగాట అడుతుంది అదేంటీ అంటారా? అవును దొంగాట అనే సినిమాలో నటిస్తుంది. అంతే కాదు నిర్మాణ సారధ్యం కూడా ఆమే వహిస్తుంది.

ఇందులో ఏం ప్రత్యేకత ఉందండీ బాబు అంటారా అక్కడే ఉంది అసలు కథ ఈ చిత్రంలో లక్ష్మీ ఓ పాటలో ఐదుగురు హీరోలతో డ్యాన్స్ చేయబోతుంది. ఎవరండీ ఆ ఐదుగురు హీరోలు అంటారా ఆశామాశీ హీరోలు కాదు బాబోయ్ నాగార్జున‌, ర‌వితేజ‌, నాని, శింబు, రానా. ఈ సినిమాలో ఈ పాట స్పెష‌లాఫ్ ఎట్రాక్ష‌న్ గా నిల‌వ‌బోతోంద‌ని తెలుస్తోంది.

అంతే కాదు.. ఈ పాట‌లో తాప్సి కూడా క‌నిపించ‌నున్న‌ద‌ని సమాచారం. ఒకే సినిమాలో ఇంత‌మంది గెస్ట్‌లా?? మంచు ల‌క్ష్మి ఏం చేసినా సమ్‌థింగ్ స్పెష‌ల్‌గా ఉండాలి క‌దా.??? అందుకే ఈ ప్ర‌య‌త్నం చేస్తోంది. మ‌రి ఈ ఐదుగురు హీరోల పాట ఏ స్థాయిలో ఉంటుందో...?? మంచు లక్ష్మీ డ్యాన్స్ పరఫ్మామెన్స్ ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: