పవన్ దాసరిల మెగా మూవీ ప్రాజెక్ట్ మరో సంచలనానికి శ్రీకారం చుట్టబోతోంది అని అనిపించేడట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు పనిచేయబోయే సాంకేతిక నిపుణులు కూడా ఆస్కార్ అవార్డు విజేతలు కావడం బట్టి ఈసినిమా రేంజ్ ఏ స్థాయికి వెళ్ళబోతోందో అర్ధం అవుతోంది. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం దాసరి పవన్ సినిమా కోసం ఏకంగా ఆస్కార్ అవార్డు విన్నర్ ను రంగంలోకి దించుతున్నాడు అనే వార్తలు రావడం అందర్నీ షాక్ కు గురి చేస్తోంది.

ఇండియన్ సినిమా రంగంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంగీత దర్శకుడిగా ఖ్యాతి గాంచిన రెహమాన్ ను దాసరి తాను పవన్ తో నిర్మించబోతున్న సినిమాకు సంగీత దర్శకత్వం వహించడానికి కేవలం ఒక్క ఫోన్ కాల్ తో రెహమాన్ అంగీకారం పొందినట్లుగా వార్తలు వస్తున్నాయి.

సంగీత దర్శకుడు కోటి దగ్గర సహాయకుడిగా రెహమాన్ పనిచేసే రోజుల నుండి దాసరికి రెహమాన్ తో ఉన్న పరిచయాలు పవన్ సినిమాకు అతడిని ఒప్పించడానికి చాల సులువుగా ఉపయోగ పడ్డాయి అనే మాటలు కూడా ఉన్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ దసరిల కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు పవన్ డ్రీమ్ ప్రాజెక్ట్ సత్యాగ్రహి కథ సినిమాగా మారనున్నది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ వార్తలకు మరొక ట్విస్ట్ గా ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకత్వం వహించే ఆలోచన కూడ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తల హడావిడి వినిపిస్తోంది. పవన్ దాసరిల సినిమా పై మీడియాలో జరుగుతున్న హడావిడి చూస్తూ ఉంటే ప్రారంభం కాకుండానే ఈ సినిమా టాలీవుడ్ లో ఒక పెను సంచలనం సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: