మెగా స్టార్ గా టాలీవుడ్ ను ఏలిన చిరంజీవికి ఒక ప్రముఖ నిర్మాత చేసిన కామెంట్లు షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత సంచలన వార్తలకు చిరునామాగా ఉండే సి. కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారాయి. ఈ సంచలనాత్మక నిర్మాత గతంలో మహేష్ తో, నానితో, బాలకృష్ణతో అనేక సినిమాలను నిర్మించాడు. ముఖ్యంగా బాలకృష్ణ తో దాసరిని దర్శకుడిగా పెట్టుకుని సి. కళ్యాణ్ నిర్మించిన ‘పరమ వీరచక్ర’ బాలకృష్ణ అభిమానులు కూడా మరిచిపోలేని భయంకరమైన ఫ్లాప్.

అలాంటి సంచలన నిర్మాత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నిర్మించబోతున్న సినిమాల లిస్టును తెలియచేసాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘జ్యోతి లక్ష్మి’ సినిమాను వరుణ్ తేజ్ తో మరో సినిమాను తాను తీయబోతున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు తనకు అవకాశం ఇస్తే చిరంజీవి 150వ సినిమాను అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తానని సంచలన వ్యాఖ్యలు చేసాడు కళ్యాణ్.

చిరంజీవితో 150వ సినిమా చేయాలనే కల చాలామంది నిర్మాతలకు ఉన్నా ఈ లిస్టులో సి. కళ్యాణ్ చేరడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. దీనికి కారణo సి. కళ్యాణ్ దాసరి నారాయణరావుకి అత్యంత సన్నిహితుడు అని చాల మంది అంటారు. ఒక వైపు దాసరి తన సొంత నిర్మాణ సంస్థలో పవన్ ను రంగంలోకి దింపుతూ ఉంటే దాసరి శిష్యుడు నిర్మాత కళ్యాణ్ ఏకంగా చిరంజీవిని టార్గెట్ చేయడం టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.

ఈ మధ్య ఎన్నో సినిమాలు తీసి భారీగా నష్టపోయిన సి. కళ్యాణ్ కు ఈమధ్య కాలంలో దెయ్యం సినిమాల డబ్బింగులు బాగా కలిసి వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం హన్సిక నటించిన దెయ్యం సినిమా ‘చంద్రకళను’ తెలుగులో డబ్ చేసి విజయం సాధించిన కళ్యాణ్ ఇప్పుడు లేటెస్ట్ గా ‘పిశాచి’ అనే మరో దెయ్యం సినిమాను తెలుగులో డబ్ చేసి వచ్చే వారం విడుదల చేయబోతున్నాడు. ఇంతకీ చిరంజీవి ఈ సి. కళ్యాణ్ కోరికను తీరుస్తాడో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: