సర్వ సాధారణంగా టాప్ హీరోల పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనంగా అభిమానులు జరుపుకుంటూ ఆరోజున రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మన దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోల పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి ఈ హడావిడి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే రజినీకాంత్ అభిమానులు తమ సూపర్ స్టార్ రజినీ పెళ్లిరోజు వేడుకలను కూడ అత్యంత ఘనంగా ఈరోజు చెన్నైలో నిర్వహిస్తూ ఉండటం కోలీవుడ్ మీడియాకే హాట్ టాపిక్ గా మారింది.

రజినీకాంత్ తన భార్య లతను 1981 ఫిబ్రవరి 26న పెళ్ళి చేసుకున్న నేపధ్యంలో నేటితో వారి వివాహ బంధానికి 34 ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చెన్నైలోని తలైవర్ ఫౌండేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు వ్రుధులకు పిల్లలకు అన్నదాన వస్త్రదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.

అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న అనేక ఆలయాలలో రజినీకాంత్ లతా దంపతుల పేరిట ఈరోజు ఉదయం నుండి పూజా కార్యక్రమాలు రజినీ అభిమానులు నిర్వహిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చెన్నై పట్టణం అంతా రజినీకాంత్ లతా దంపతులకు సంబంధించిన ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు బ్యానర్లతో చెన్నై పట్టణంలో హడావిడి కనిపిస్తోందని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.

‘లింగ’ పరాజయం తరువాత రజినీకాంత్ హవా అయిపోయింది అని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఆ కామెంట్స్ కు సమాధానంగా రజినీ మ్యానియా ఇంకా తమిళ నాడులో ఏ స్థాయిలో ఉందో తెలియచేసే ఉద్దేశ్యంతోనే రజినీ వీరాభిమానులు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసారు అనే వార్తలు కూడా ఉన్నాయి. వచ్చే సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో రజినీ ఇమేజ్ ను మరింత పెంచే విధంగా ఈ కార్యక్రమాలు రూపొందిoచడం వెనుక పెద్ద వ్యూహాత్మక ఎత్తుగడలే ఉన్నాయి అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: