నాగార్జున కు యువతరం పై ముఖ్యం గా అమ్మాయిల పై కోపం వచ్చింది. ఏ విషయంలోను తన అభిప్రాయాలను స్పష్టంగా తెలపకుండా సినిమాల దగ్గర నుంచి తన వ్యాపారాల వరకు చాల తెలివిగా వ్యవహరించే నాగ్ నేటితరం అమ్మాయిల పై సెటైర్లు వేసాడు. మొన్న ప్రసారం అయిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో అతిధిగా వచ్చిన హీరో నానితో గేమ్ ఆడుతూ నాగ్ నేటి యువతరం పై ముఖ్యంగా అమ్మాయిల పై కామెంట్లు చేసాడు.

ఈమధ్య నాగ్ తన అన్నపూర్ణా స్టూడియో వైపు కారులో వస్తున్నప్పుడు ఒక బిజీ బస్టాండ్ లో ఉన్న అనేకమంది అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరికీ వారు ఈ ప్రపంచం తమకు సంబంధం లేదు అన్నట్లుగా తమతమ సెల్ ఫోన్స్ వైపు తదేకంగా చూసుకుంటూ తమ సెల్ ఫోన్ స్క్రీన్స్ పై సీరియస్ గా చూసుకుంటూ కాలం గడుపుతున్నారట.

ఆ దృశ్యాన్ని చూసిన నాగార్జున షాక్ అయ్యాడట. జీవితంలో నేటి యువతరం సెల్ ఫోన్స్ లో కనిపించే విషయాలకంటే ఎన్నో ముఖ్యమైన మరెన్నో అందమైన విషయాలు మన చుట్టూ ఉన్నాయని మర్చిపోయి గంటల కొద్దీ సెల్ ఫోన్స్ ను అతుక్కుని ఉండటం వల్ల జీవితంలో ఎంతో పోగొట్టుకుంటున్నామనే వాస్తవం నేటి యువతరం తెలుసుకోవాలి అంటూ క్లాసు పీకాడు నాగార్జున.

ఈ మాటలతో ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్న చాలామంది యూత్ ఖంగ్ తిన్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా నాగార్జున నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సెకండ్ సీజన్ ఆఖరి ఎపిసోడ్ రేపు శుక్రు వారం ప్రసారం కాబోతోంది. ఈ ఆఖరి ఎపిసోడ్ కు విలక్షణ నటుడు టాప్ హీరో కమలహాసన్ అతిధిగా వస్తూ నాగ్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కు ముగింపు పలకబోతున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: